Political News

‘అమ‌రావ‌తి కేసులు వెంట‌నే విచారించండి ప్లీజ్‌’

ఎప్పుడెప్పుడు విశాఖ‌కు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్ర‌భుత్వం.. దీనికి సంబంధించి ప్ర‌ధాన అడ్డంకిగా ఉన్న అమ‌రావ‌తి కేసుల విష‌యంలో ఎన్న‌డూలేని విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఢిల్లీలో మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే విశాఖ‌కు వెళ్లిపోతామ‌ని.. విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామ‌ని.. వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం అనంత‌రం.. రాజ‌కీయంగా సెగ ప్రారంభ‌మైంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. అమ‌రావ‌తి రైతులు త‌మ ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో ఉలిక్కిప‌డిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. రాజధాని అమ‌రావ‌తిపై పెండింగులో ఉన్న అన్ని కేసుల‌ను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు లేఖ పంపింది. ఆయా కేసుల‌ను వెంటనే మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని పేర్కొంది. ఈ నెల 6న మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును అభ్యర్థించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని కోరుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. దీంతో ప్ర‌భుత్వానికి కొంత ఊపిరి తీసుకునే అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది. అయితే జ‌న‌వ‌రి 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది లేఖ‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటీషన్‌ను ఈనెల 6న మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖ‌లో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్టారును ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. ఇదంతా కూడా ఏదో ఒక‌టి తేల్చుకుని విశాఖ‌కు వెళ్లిపోవాల‌నే ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం లేఖ సంధించింద‌నే వాద‌న వినిపిస్తోంది.

This post was last modified on February 4, 2023 10:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

9 minutes ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

2 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

3 hours ago

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు…

3 hours ago

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

5 hours ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

5 hours ago