ఎప్పుడెప్పుడు విశాఖకు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వం.. దీనికి సంబంధించి ప్రధాన అడ్డంకిగా ఉన్న అమరావతి కేసుల విషయంలో ఎన్నడూలేని విధంగా దూకుడు ప్రదర్శించింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖకు వెళ్లిపోతామని.. విశాఖను రాజధాని చేస్తామని.. వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అనంతరం.. రాజకీయంగా సెగ ప్రారంభమైంది. ఇదిలావుంటే.. మరోవైపు.. అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఉలిక్కిపడిన ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. రాజధాని అమరావతిపై పెండింగులో ఉన్న అన్ని కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు లేఖ పంపింది. ఆయా కేసులను వెంటనే మెన్షన్ లిస్ట్లో చేర్చాలని పేర్కొంది. ఈ నెల 6న మెన్షన్ లిస్ట్లో చేర్చాలని రిజిస్ట్రారును అభ్యర్థించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం.. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చినట్టయింది. అయితే జనవరి 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ను ఈనెల 6న మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్టారును ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. ఇదంతా కూడా ఏదో ఒకటి తేల్చుకుని విశాఖకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం లేఖ సంధించిందనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on February 4, 2023 10:28 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…