ఎప్పుడెప్పుడు విశాఖకు వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వం.. దీనికి సంబంధించి ప్రధాన అడ్డంకిగా ఉన్న అమరావతి కేసుల విషయంలో ఎన్నడూలేని విధంగా దూకుడు ప్రదర్శించింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖకు వెళ్లిపోతామని.. విశాఖను రాజధాని చేస్తామని.. వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అనంతరం.. రాజకీయంగా సెగ ప్రారంభమైంది. ఇదిలావుంటే.. మరోవైపు.. అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఉలిక్కిపడిన ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. రాజధాని అమరావతిపై పెండింగులో ఉన్న అన్ని కేసులను తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రారుకు లేఖ పంపింది. ఆయా కేసులను వెంటనే మెన్షన్ లిస్ట్లో చేర్చాలని పేర్కొంది. ఈ నెల 6న మెన్షన్ లిస్ట్లో చేర్చాలని రిజిస్ట్రారును అభ్యర్థించింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అమరావతిపై మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం.. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చినట్టయింది. అయితే జనవరి 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ను ఈనెల 6న మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్టారును ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. ఇదంతా కూడా ఏదో ఒకటి తేల్చుకుని విశాఖకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం లేఖ సంధించిందనే వాదన వినిపిస్తోంది.
This post was last modified on February 4, 2023 10:28 pm
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…