ఏపీలో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వానికి జరుగుతున్న ఆధిపత్య పోరులో సీనియర్ అధికారులు సతమత మవుతున్నారా? ఏం జరిగినా.. వారిదే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమకు రావాల్సిన జీతాలను 1వ తేదీ కల్లా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము దాచుకున్న సొమ్మును కూడా సర్కారు వాడుకుంటోందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సంఘం నేతలతో కలిసి గవర్నర్ను కలిసారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. 1వ తారీకు న జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని.. ఆదిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తాము దాచుకున్న సొమ్మును కూడా కోట్ల రూపాయలను ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వాడేసుకుందన్నారు.
ఇక, దీనిపై ప్రభుత్వం ఆగ్రహించడం.. సంఘం రద్దు చేస్తామని పేర్కొనడం తెలిసిందే. దీంతో ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. మధ్యంతర ఉత్తర్వులు ఉద్యోగులకు అనుకూలంగా కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్ పీ సిసోడియాను అర్ధంతరంగా వేటు వేసింది. ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వకుండా.. గవర్నర్ కార్యాలయం నుంచి తప్పించింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే.. ఇంత అర్ధంతరంగా ఆయనను బదిలీ చేయడం వెనుక.. రీజనేంటి? అని ఆలోచిస్తే.. ఇటీవల ఉద్యోగులు వచ్చి గవర్నర్ను కలవడమే కారణమనే గుసగుస వినిపిస్తోంది. ప్రబుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్న సమయంలో గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇవ్వడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని.. ఆయన అంగీకారంతోనే అప్పాయింట్మెంట్ ఖరారైందని.. ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేసిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on February 4, 2023 5:27 pm
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…