ఏపీలో ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వానికి జరుగుతున్న ఆధిపత్య పోరులో సీనియర్ అధికారులు సతమత మవుతున్నారా? ఏం జరిగినా.. వారిదే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమకు రావాల్సిన జీతాలను 1వ తేదీ కల్లా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము దాచుకున్న సొమ్మును కూడా సర్కారు వాడుకుంటోందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సంఘం నేతలతో కలిసి గవర్నర్ను కలిసారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఫిర్యాదులు చేశారు. 1వ తారీకు న జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని.. ఆదిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తాము దాచుకున్న సొమ్మును కూడా కోట్ల రూపాయలను ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వాడేసుకుందన్నారు.
ఇక, దీనిపై ప్రభుత్వం ఆగ్రహించడం.. సంఘం రద్దు చేస్తామని పేర్కొనడం తెలిసిందే. దీంతో ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. మధ్యంతర ఉత్తర్వులు ఉద్యోగులకు అనుకూలంగా కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్ పీ సిసోడియాను అర్ధంతరంగా వేటు వేసింది. ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వకుండా.. గవర్నర్ కార్యాలయం నుంచి తప్పించింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే.. ఇంత అర్ధంతరంగా ఆయనను బదిలీ చేయడం వెనుక.. రీజనేంటి? అని ఆలోచిస్తే.. ఇటీవల ఉద్యోగులు వచ్చి గవర్నర్ను కలవడమే కారణమనే గుసగుస వినిపిస్తోంది. ప్రబుత్వంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్న సమయంలో గవర్నర్ అప్పాయింట్మెంట్ ఇవ్వడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని.. ఆయన అంగీకారంతోనే అప్పాయింట్మెంట్ ఖరారైందని.. ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేసిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on February 4, 2023 5:27 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…