రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కొందరి కుర్చీలకు వచ్చిన ఇబ్బంది లేదని పార్టీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి గణనీయంగా బాగుండడం.. నాయకులు కూడా దూకుడగా పనిచేస్తుండడం ప్రజలతో మమేకం కావడం వంటి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో సుమారు 20 నియోజకవర్గాల్లో పరిస్థితి చింతలేని విధంగా ఉంద ని పార్టీ అంచనాకు వచ్చింది.
పరుచూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు.. వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. ప్రజలకు చేరువ కూడా అయ్యారు. దీంతో ఆయనకు తిరుగులేదని పార్టీ నిర్ణయించింది. మరోవైపు వైసీపీ మాత్రం ఇక్కడ ప్రయోగాల దశలోనే ఉండడం గమనార్హం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను ఇక్కడకు పంపించాలని నిర్ణయించినా..ఆయన ఇప్పటి వరకు అడుగు కూడా పెట్టలేదు. దీంతో వైసీపీ మాట ఇక్కడ వినిపించడం లేదు.
ఇక, పాలకొల్లు. ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని పాలకొల్లులోనూ.. నిమ్మల రామానాయుడు.. వరుస విజయాలు దక్కించుకున్నారు. ఇక్కడ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. టీడీపీకి మేలు చేస్తోంది. అదే విధంగా అద్దంకి నియోజకవర్గంలోనూ గొట్టిపాటి రవికి ప్రజల్లో ఫాలోయింగ్ మరింత పెరిగింది. దీంతో ఇక్కడ మరో సారి విజయం ఖాయమనే భావన టీడీపీ లో కనిపిస్తోంది.
హిందూపురం, కుప్పం, టెక్కలి, రాజమండ్రి సిటీ, రూరల్, విశాఖ పట్నంలోని తూర్పు ఉత్తరం, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాలు కూడా మరోసారి టీడీపీకే దక్కనున్నాయి. అదే సమయంలో విజయవాడ సెంట్రల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ సారి టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం తధ్యమనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు.. 20-30 స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం లేదని.. పార్టీలో చర్చ జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on February 4, 2023 2:02 pm
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…