టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విషయంలో ఏపీ పోలీసులు పైకి మెత్తని కబుర్లు చెబుతున్నా.. దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. మరి పైనుంచి వచ్చిన ఆదేశాలో.. లేక వారే పేరు కోసం చేస్తున్నారో తెలియదు కానీ… తాజాగా యువగళం పాదయాత్రకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న రెండు సౌండ్ సిస్టమ్లను ఎత్తుకుపోయారు. వీటితోపాటు నారా లోకేష్ ఒకింత విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునే స్టూల్ను కూడా పట్టుకుపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా నారా లోకేష్ ప్రకటించారు. తాజాగా యువగళం పాదయాత్ర 9వ రోజుకు చేరింది. ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం తుంబ కుప్పంలో యువగళం కొనసాగుతోంది. ఈ సయమంలో అక్కడకు వచ్చిన పోలీసులు రెండు సౌండ్ సిస్టం వాహనాలను పట్టుకెళ్ళారని.. వాటితో పాటు తన స్టూల్ కూడా పట్టుకు పోయారనని లోకేష్ తెలిపారు.
ఈ సందర్భంగా లోకేష్ పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీ ఎస్పీకి స్టూల్ కావాలంటే నాకు చెప్పండి.. స్టూల్ ఏం ఖర్మ మంచి సోఫానే కొనిస్తా. కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు అని వ్యాఖ్యానించారు. 100 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర పూర్తి కాక ముందే తనపై 16వ కేసు పెట్టారని నారా లోకేష్ వెల్లడించారు.
బీసీలకు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది సున్నా అని లోకేష్ పేర్కొన్నారు. ‘‘బీసీలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. వెనకబడిన కులాలవారు సలహాదారులుగా పనికిరారా? జగన్ అతని సామాజికవర్గానికి చెందిన నేతలకు రూ.3 లక్షల జీతం.. కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. వారివల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగమైనా జరిగిందా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
This post was last modified on February 4, 2023 1:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…