Political News

లోకేష్ కూర్చునే స్టూల్ ఎత్తుకుపోయిన పోలీసులు..

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విష‌యంలో ఏపీ పోలీసులు పైకి మెత్త‌ని క‌బుర్లు చెబుతున్నా.. దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి పైనుంచి వ‌చ్చిన ఆదేశాలో.. లేక వారే పేరు కోసం చేస్తున్నారో తెలియ‌దు కానీ… తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి ఏర్పాటు చేసుకున్న రెండు సౌండ్ సిస్ట‌మ్‌ల‌ను ఎత్తుకుపోయారు. వీటితోపాటు నారా లోకేష్ ఒకింత విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునే స్టూల్‌ను కూడా ప‌ట్టుకుపోయారు.

ఈ విష‌యాన్ని స్వయంగా నారా లోకేష్ ప్ర‌క‌టించారు. తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర 9వ రోజుకు చేరింది. ప్ర‌స్తుతం ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం బంగారుపాళ్యం మండలం తుంబ కుప్పంలో యువ‌గ‌ళం కొన‌సాగుతోంది. ఈ స‌య‌మంలో అక్క‌డ‌కు వ‌చ్చిన పోలీసులు రెండు సౌండ్ సిస్టం వాహనాలను పట్టుకెళ్ళారని.. వాటితో పాటు తన స్టూల్ కూడా పట్టుకు పోయారనని లోకేష్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా లోకేష్ పోలీసుల‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీ ఎస్పీకి స్టూల్ కావాలంటే నాకు చెప్పండి.. స్టూల్ ఏం ఖ‌ర్మ‌ మంచి సోఫానే కొనిస్తా. కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు అని వ్యాఖ్యానించారు. 100 కిలోమీట‌ర్ల మేర‌కు పాదయాత్ర పూర్తి కాక ముందే తనపై 16వ కేసు పెట్టారని నారా లోకేష్ వెల్లడించారు.

బీసీలకు జగన్‌ ప్రభుత్వం ఖర్చు పెట్టింది సున్నా అని లోకేష్‌ పేర్కొన్నారు. ‘‘బీసీలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. వెనకబడిన కులాలవారు సలహాదారులుగా పనికిరారా? జగన్‌ అతని సామాజికవర్గానికి చెందిన నేతలకు రూ.3 లక్షల జీతం.. కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. వారివల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగమైనా జరిగిందా?“ అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు.

This post was last modified on February 4, 2023 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

2 hours ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

2 hours ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

4 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago