Political News

తమిళిసైని ఏమీ అనలేదట…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కోర్టు జోక్యంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సినిమాటిక్ గా గవర్నర్ రావడం, కేసీఆర్ నమస్కారం చేయడం, తనకు ఇచ్చిన స్క్రిప్టును ఆమె చదివి వెళ్లిపోవడం జరిగిపోయాయి. గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ మొదటి రోజున మసాలా వార్తలు లేక మీడియా కొంత అసంతృప్తి చెందిన మాట వాస్తవం.

గవర్నర్ ప్రసంగంపై కిషన్ రెడ్డి

రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అవాస్తవాలు చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆమెతో అన్నీ అబద్దాలు చెప్పించిందన్నరు. కోర్టుకు భయపడే గవర్నర్ ప్రసంగాన్ని షెడ్యూల్ లో పెట్టారన్న ఆయన… లేని అభివృద్ధిని తమిళిసై ప్రసంగంలో చేర్చారన్నారు. పాడుబడ్డ తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయని గవర్నర్ తో చదివించిన రాష్ట్ర ప్రభుత్వం.. సర్పంచులకు బిల్లులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినదీ కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను మళ్లిస్తూ… తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ ప్రసంగంపై విరుచుకుపడ్డారు.

బీజేపీ నేతలే గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపట్టడంపై అన్ని వర్గాల్లో చర్చ జరిగింది. అదేమిటి గవర్నర్ ప్రసంగం లేదని ఇంతకాలం గోల చేసిన కమలనాథులు ఇప్పుడిలా మాట్లాడుతున్నారేమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నించాయి. అయితే అందులో తప్పేముందని బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. స్పీచ్ చదివిందీ గవర్నరే అయినా.. రాసిచ్చిందీ ప్రభుత్వమే కదా అని గుర్తు చేస్తున్నారట. విధాన పరంగా తాము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించామని, అందులో గవర్నర్ ను తప్పుపట్టే రాజకీయమేదీ లేదని చెప్పుకుంటున్నారట. పైగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం తమిళిసై పోరాడుతున్నారని, ప్రభుత్వానికి సంబంధం లేకుండా పర్యటనలు చేస్తూ జనంలో ఉంటున్నారని చెబుతున్నారట. బీఆర్ఎస్ నేతలే తమపై కావాలని బురద చల్లేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారన్నది బీజేపీ రాష్ట్ర అగ్రనేతల వాదన.

This post was last modified on February 4, 2023 9:07 am

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

1 hour ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

1 hour ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

1 hour ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

3 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

4 hours ago

మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్, కారణం అదేనా?

హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…

4 hours ago