ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అనే సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి.. జగన్ ఈ తరహా పనులు చేయొచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డున పడ్డారని.. రఘురామ చెప్పారు.
ఇక, ”ప్రజలకిచ్చిన మాట తప్పిన జగన్.. ప్రజాద్రోహి కాదా?” అని రఘురామ ప్రశ్నించారు. సీఎంను ప్రజాప్రతినిధులు ప్రశ్నించవద్దా? జీ హుజూర్ అనాలా? అని ఎంపీ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎవరైనా సరే సీఎం కావచ్చునని జగన్ తెలుసుకోవాలని రఘురామ అన్నారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్లు ప్రభుత్వం మానేస్తే మంచిదని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరమని, గతంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. ఒక్క ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో తనకు వచ్చిన కష్టమే.. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి కోటంరెడ్డి తీసుకువెళ్లాలని సూచించారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…