తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌథంగా అభివర్ణించే కొత్త సచివాలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున నిర్మించిన ఈ భవనం.. ఈ నెల 17న ఘనంగా ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
కొత్త సచివాలయంమొదటి అంతస్తులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో.. భారీ ఎత్తున పొగలు.. సచివాలయం పైన ఏర్పాటు చేసిన గుమ్మటం వెనుక నుంచి వచ్చాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ కు రియాక్టు అయిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన సచివాలయానికి వెళ్లారు. పదకొండు ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
కొత్త సచివాలయం ఓపెనింగ్ నేపథ్యంలో.. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాత్రి పగలు అన్న తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వుడ్ వర్కు జరుగుతోంది. ఈ పనులు జరుగుతున్న వేళలోనే మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మంటలకు కారణం ఏమిటన్న విషయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది.
మొత్తంగా అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి.. పెద్ద ఎత్తున ఫైరింజన్లను మొహరించటంతో మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గరకు వస్తున్న వేళలో.. ఈ తరహాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం కచ్ఛితంగా అపశకునమే అన్న మాట వినిపిస్తోంది. మరి.. అగ్నిప్రమాదం నేపథ్యంలో.. ముందుగా అనుకున్న ముహుర్తానికి సచివాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చేపడతారా? లేదంటే ఆగుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on February 3, 2023 8:40 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…