ఏపీపై కేంద్రం వైఖరి మారుతోంది. రాజకీయంగా ఏదో తేడా వస్తోంది. నిన్న మొన్నటి వరకు జగన్ సర్కారు కు అండగా ఉన్న కేంద్రం అనూహ్యంగా రూటు మార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ మార్పునకు రీజనేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్కు ఇప్పటి వరకు కేంద్రం అండగానే ఉంది. అదేవిధంగా జగన్ కూడా కేంద్రానికి దన్నుగా ఉన్నారు.
పరస్పర సహకారం కలిసి వచ్చింది. కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలను తన ఎంపీలతో జగన్ సహకరించా రు. అలాగే.. రాష్ట్రానికి అవసరమైన మేరకు అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించడం వంటివి ఇప్పటి వరకు సజావుగానే సాగాయి. ఇక, కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వివిధ పథకాలకు వాడుతున్నా రనే వాదన వినిపిస్తున్నా.. కేంద్రం మాత్రం మౌనంగానే ఉంటోంది.
అంటే.. మొత్తంగా ఇరు పక్షాల మధ్య సహకారం.. ఉభయకుశలోపరి అన్నట్టుగానే సాగుతుండడం గమనా ర్హం. అయితే.. ఇక్కడ తాజా విషయానికి వస్తే..ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఎక్కడో బీజేపీ.. తన దారి తాను చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేసే క్రమంలోనే వైసీపీకి దూరం పాటిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు తాజాగా సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన రెండు రోజులు ఢిల్లీలోనే ఉంటారని.. అధికార వర్గాలు షెడ్యూ ల్ ఇచ్చాయి. కానీ.. అనూహ్యంగా జగన్ ఒక్కరోజులోనే తన పర్యటనను ముగించుకుని వచ్చేశారు. నిజానికి జగన్ ఢిల్లీ పర్యట న వెనుక.. సీబీఐ దూకుడును అంతో ఇంతో నివారించే ఉద్దేశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఢిల్లీ పెద్దలు జగన్కు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. మొత్తానికి ఈ పరిణామం గమనిస్తే.. ఏదో తేడా వస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 2, 2023 9:18 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…