బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రవేశపెట్టారు. సుదీర్ఘ ప్రసంగం.. కొన్ని చలోక్తులు.. మరి కొన్ని స్వోత్కర్షలు మినహా.. ఈ బడ్జెట్లో రాష్ట్రాల ప్రస్తావన పెద్దగా లేదు. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బడ్జెట్ వంటకానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఆర్థిక శాఖ టు.. ఏపీ భవన్ అంటూ.. నిత్యం ఆయన కారులో తిరిగి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఏపీకి ఇది కావాలి.. అది కావాలి.. అని ప్రస్తావించారు. ఈ కష్టాన్ని మనం గుర్తించాలి!
ప్రధానంగా విశాఖలో భారీ ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించినట్టు అప్పట్లోనే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే విశాఖను పాలనా రాజధాని చేయాలని భావిస్తున్న వైసీపీకి ఇది చోద శక్తిగా మారుతుందనే అంచనాలు ఉండి ఉండొచ్చు. ఇదిలావుంటే.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకు ముందైనా పరుగులు.. ఉరుకులు పెట్టించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిన మాటను కూడా విస్మరించలేం. ఆయన కానీ, ఆయన మంత్రి బుగ్గన కానీ.. ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రతిసారీ పోలవరం గురించి చెప్పారు.
ఇక, బడ్జెట్కు ముందు కూడా బుగ్గన ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ను కలిసి.. పోలవరం గురించి ప్రస్తావించారు. సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టుకు రూ.57,638 కోట్లను కేటాయించాలని ఆయన అనేక సార్లు అభ్యర్థించారు. ఇవి కాకుండా.. నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కోసం.. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మరి.. ఇప్పుడు తాజాగా.. ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏమేరకు.. జగన్ సక్సెస్ అయ్యారు? ఏమేరకు బుగ్గన అభ్యర్థనలు ఫలించాయి? అంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే.. ఏపీ గురించిన ప్రస్తావన కేవలం మొత్తం ప్రసంగంలో 2 నిమిషాలలోపే ఉండడం గమనార్హం.
ఇక, ఏపీకి ఇచ్చిన వాటిని చూస్తే..
This post was last modified on February 1, 2023 9:30 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…