బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రవేశపెట్టారు. సుదీర్ఘ ప్రసంగం.. కొన్ని చలోక్తులు.. మరి కొన్ని స్వోత్కర్షలు మినహా.. ఈ బడ్జెట్లో రాష్ట్రాల ప్రస్తావన పెద్దగా లేదు. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బడ్జెట్ వంటకానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఆర్థిక శాఖ టు.. ఏపీ భవన్ అంటూ.. నిత్యం ఆయన కారులో తిరిగి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఏపీకి ఇది కావాలి.. అది కావాలి.. అని ప్రస్తావించారు. ఈ కష్టాన్ని మనం గుర్తించాలి!
ప్రధానంగా విశాఖలో భారీ ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించినట్టు అప్పట్లోనే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే విశాఖను పాలనా రాజధాని చేయాలని భావిస్తున్న వైసీపీకి ఇది చోద శక్తిగా మారుతుందనే అంచనాలు ఉండి ఉండొచ్చు. ఇదిలావుంటే.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకు ముందైనా పరుగులు.. ఉరుకులు పెట్టించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిన మాటను కూడా విస్మరించలేం. ఆయన కానీ, ఆయన మంత్రి బుగ్గన కానీ.. ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రతిసారీ పోలవరం గురించి చెప్పారు.
ఇక, బడ్జెట్కు ముందు కూడా బుగ్గన ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ను కలిసి.. పోలవరం గురించి ప్రస్తావించారు. సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టుకు రూ.57,638 కోట్లను కేటాయించాలని ఆయన అనేక సార్లు అభ్యర్థించారు. ఇవి కాకుండా.. నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కోసం.. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మరి.. ఇప్పుడు తాజాగా.. ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏమేరకు.. జగన్ సక్సెస్ అయ్యారు? ఏమేరకు బుగ్గన అభ్యర్థనలు ఫలించాయి? అంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే.. ఏపీ గురించిన ప్రస్తావన కేవలం మొత్తం ప్రసంగంలో 2 నిమిషాలలోపే ఉండడం గమనార్హం.
ఇక, ఏపీకి ఇచ్చిన వాటిని చూస్తే..
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…