బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రవేశపెట్టారు. సుదీర్ఘ ప్రసంగం.. కొన్ని చలోక్తులు.. మరి కొన్ని స్వోత్కర్షలు మినహా.. ఈ బడ్జెట్లో రాష్ట్రాల ప్రస్తావన పెద్దగా లేదు. అయితే.. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బడ్జెట్ వంటకానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. ఆర్థిక శాఖ టు.. ఏపీ భవన్ అంటూ.. నిత్యం ఆయన కారులో తిరిగి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఏపీకి ఇది కావాలి.. అది కావాలి.. అని ప్రస్తావించారు. ఈ కష్టాన్ని మనం గుర్తించాలి!
ప్రధానంగా విశాఖలో భారీ ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించినట్టు అప్పట్లోనే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకంటే విశాఖను పాలనా రాజధాని చేయాలని భావిస్తున్న వైసీపీకి ఇది చోద శక్తిగా మారుతుందనే అంచనాలు ఉండి ఉండొచ్చు. ఇదిలావుంటే.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును ఎన్నికలకు ముందైనా పరుగులు.. ఉరుకులు పెట్టించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిన మాటను కూడా విస్మరించలేం. ఆయన కానీ, ఆయన మంత్రి బుగ్గన కానీ.. ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రతిసారీ పోలవరం గురించి చెప్పారు.
ఇక, బడ్జెట్కు ముందు కూడా బుగ్గన ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ను కలిసి.. పోలవరం గురించి ప్రస్తావించారు. సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టుకు రూ.57,638 కోట్లను కేటాయించాలని ఆయన అనేక సార్లు అభ్యర్థించారు. ఇవి కాకుండా.. నూతన జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కోసం.. ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మరి.. ఇప్పుడు తాజాగా.. ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏమేరకు.. జగన్ సక్సెస్ అయ్యారు? ఏమేరకు బుగ్గన అభ్యర్థనలు ఫలించాయి? అంటే.. చెప్పడం కష్టమే. ఎందుకంటే.. ఏపీ గురించిన ప్రస్తావన కేవలం మొత్తం ప్రసంగంలో 2 నిమిషాలలోపే ఉండడం గమనార్హం.
ఇక, ఏపీకి ఇచ్చిన వాటిని చూస్తే..
This post was last modified on February 1, 2023 9:30 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…