తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా పార్టీ పెద్దలపై విరుచుకుపడ్డ సీనియర్ నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై వైసీపీ అధిష్టానం కూడా అదే రేంజ్లో దూకుడు పెంచేసింది. ఆయన మీడియా సమావేశం ముగిసీ ముగియగానే వైసీపీ అధిష్టానం ఆదేశాలతో నాయకులు రంగంలోకి దిగిపోయారు. కోటంరెడ్డికి కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు.
ఈ క్రమంలో కోటంరెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలో కోటంరెడ్డికి ఏం తక్కువ చేశామన్నారు. ఆయనకు వరుసగా టికెట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. మంత్రి పదవులు అందరూ కోరుకుంటారని.. కానీ, పార్టీకి విస్తృతమైన లక్ష్యాలు.. రాష్ట్ర ప్రయోజనాలు.. వచ్చే ఎన్నికలు అనేక మూడు ఫార్ములాలు ఉంటాయని చెప్పారు.
కేవలం మంత్రి పదవుల కోసమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం సరికాదన్నారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం పార్టీకి కానీ, సీఎం జగన్కు కానీ ఏమీలేదన్నారు. ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటామని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్లను నమ్ముకుని ఆయన పాలన చేయబోరన్నారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరని.. బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్నారు. కొంత మందిని ఎలా లాక్కోవాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసని సజ్జల దుయ్యబట్టారు. ఇక, ఇదే అంశంపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కోటంరెడ్డి విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండదని.. కేవలం కాల్ రికార్డింగ్ అవ్వొచ్చని అన్నారు.
This post was last modified on February 1, 2023 3:00 pm
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…