కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు ఆసక్తిగాను, ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. తాజాగా ఇప్పటి వరకు లేని విధంగా చిరువ్యాపారులకు పాన్ కార్డును తప్పనిసరి చేసింది. తద్వారా.. వారి లావాదేవీలపై కూడా ఐటీ కన్ను పడనుంది. అదే సమయంలో వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు లభించనుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్ తప్పనిసరి.
విద్యుత్ రంగానికి విదిలింపు.. 35 వేల కోట్లు కేటాయింపుతో నిర్మలమ్మ సరిపుచ్చారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్ల నిర్మాణం 2023-24లో చేపట్టనున్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయిన MSMEలకు రిఫండ్ పథకం ప్రవేశ పెట్టనున్నారు. ఇక, గిరిజన మిషన్ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. ఏడాదికి అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కోసం రూ.10వేల కోట్లు ఇవ్వనున్నారు.
రూ.75వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మలమ్మ పెద్దపీట.. గత బడ్జెట్లో 60 వేల కోట్లే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డుగా పాన్ నెంబర్ తప్పనిసరి. మేన్ ఇన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేశారు.
ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయింపు చేశారు. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు చేశారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. దీనికోసం 13.7 లక్షల కోట్లు కేటాయింపు చేశారు. బడ్జెట్లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయింపు. పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు.
This post was last modified on February 1, 2023 1:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…