Political News

లోకేష్ యువ‌గ‌ళానికి భారీ క్రేజ్‌… ఇది ఓట్లుగా మారితే…!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పం నుంచి జ‌న‌వ‌రి 27న భారీ ప్ర‌జా మ‌ద్ద‌తుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్ర‌కు మద్ద‌తు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారిసాధ‌క బాధ‌లు కూడా విన్నారు. కొన్ని న‌మోదు చేసుకున్నారు.

కొంద‌రికి అభ‌యం కూడా ఇచ్చారు. కుప్పంలో కూర‌గాయ‌ల మార్కెట్‌కు ప్ర‌త్యేకంగా స్థ‌లం కేటాయిస్తామని.. హామీ కూడా ఇచ్చారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగాల క‌ల్ప‌న చేస్తామ‌ని.. ఉపాధికి ఊత‌మిస్తామ‌ని కూడా నారా లోకేష్ చెప్పారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా మ్యానిఫెస్టోను రూపొందిస్తామ‌ని కూడా ఆయ‌న హామీ ఇచ్చారు. ఈ ప‌రిణామాలు.. ఆస‌క్తిగా మారాయి.

అదేస‌మ‌యంలో నారా లోకేష్‌కు.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఆయ‌న వెంట క‌లిసి అడుగులు వేస్తున్నారు. ఎటు చూసినా.. పెద్ద ఎత్తున జ‌న సందోహం క‌నిపిస్తోంది. ఎటు విన్నా యువ‌గ‌ళం నినాదం వినిపిస్తోంది. జై లోకేష్ నానాదాలు కూడా మార్మోగుతున్నాయి. క‌ట్ చేస్తే.. ఈ యువ‌గ‌ళానికి సంబంధించి ఇంత భారీ మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని పార్టీ నాయ‌కులు కూడా ఊహించి ఉండ‌ర‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే.. ఇంత పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంతా ఓటు బ్యాంకుగా మార‌తారా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కొన్ని లోటుపాట్లు పార్టీలోనే క‌నిపిస్తున్నాయి. దీంతో వాటిని స‌రిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, తొలిరోజే ఒక‌రిద్ద‌రు నాయ‌కులు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించారు.

పార్టీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టులు త‌ప్పుగా ఇస్తున్నార‌ని.. వాస్త‌వాల‌ను చెప్ప‌డం లేద‌ని వారు అన్నారు. మ‌రి వాటిని స‌రిదిద్దే కార్య‌క్ర‌మానికి .. నారా లోకేష్ ప్ర‌య‌త్నిస్తే బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఇలాంటి చేసి.. పార్టీని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

This post was last modified on February 1, 2023 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago