టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కుప్పం నుంచి జనవరి 27న భారీ ప్రజా మద్దతుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్రకు మద్దతు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాదయాత్ర చేసిన నారా లోకేష్ అనేక వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారిసాధక బాధలు కూడా విన్నారు. కొన్ని నమోదు చేసుకున్నారు.
కొందరికి అభయం కూడా ఇచ్చారు. కుప్పంలో కూరగాయల మార్కెట్కు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని.. హామీ కూడా ఇచ్చారు. ఇక, ఈ క్రమంలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తామని.. ఉపాధికి ఊతమిస్తామని కూడా నారా లోకేష్ చెప్పారు. అదేసమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను రూపొందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు.. ఆసక్తిగా మారాయి.
అదేసమయంలో నారా లోకేష్కు.. భారీ ఎత్తున ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వెంట కలిసి అడుగులు వేస్తున్నారు. ఎటు చూసినా.. పెద్ద ఎత్తున జన సందోహం కనిపిస్తోంది. ఎటు విన్నా యువగళం నినాదం వినిపిస్తోంది. జై లోకేష్ నానాదాలు కూడా మార్మోగుతున్నాయి. కట్ చేస్తే.. ఈ యువగళానికి సంబంధించి ఇంత భారీ మద్దతు వస్తుందని పార్టీ నాయకులు కూడా ఊహించి ఉండరనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే.. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో వీరంతా ఓటు బ్యాంకుగా మారతారా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. కొన్ని లోటుపాట్లు పార్టీలోనే కనిపిస్తున్నాయి. దీంతో వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇక, తొలిరోజే ఒకరిద్దరు నాయకులు అంతర్గత సమావేశాల్లో సమస్యలపై ప్రస్తావించారు.
పార్టీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టులు తప్పుగా ఇస్తున్నారని.. వాస్తవాలను చెప్పడం లేదని వారు అన్నారు. మరి వాటిని సరిదిద్దే కార్యక్రమానికి .. నారా లోకేష్ ప్రయత్నిస్తే బాగుండేదని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి చేసి.. పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
This post was last modified on February 1, 2023 11:03 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…