టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కుప్పం నుంచి జనవరి 27న భారీ ప్రజా మద్దతుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్రకు మద్దతు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాదయాత్ర చేసిన నారా లోకేష్ అనేక వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారిసాధక బాధలు కూడా విన్నారు. కొన్ని నమోదు చేసుకున్నారు.
కొందరికి అభయం కూడా ఇచ్చారు. కుప్పంలో కూరగాయల మార్కెట్కు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని.. హామీ కూడా ఇచ్చారు. ఇక, ఈ క్రమంలోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తామని.. ఉపాధికి ఊతమిస్తామని కూడా నారా లోకేష్ చెప్పారు. అదేసమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టోను రూపొందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు.. ఆసక్తిగా మారాయి.
అదేసమయంలో నారా లోకేష్కు.. భారీ ఎత్తున ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన వెంట కలిసి అడుగులు వేస్తున్నారు. ఎటు చూసినా.. పెద్ద ఎత్తున జన సందోహం కనిపిస్తోంది. ఎటు విన్నా యువగళం నినాదం వినిపిస్తోంది. జై లోకేష్ నానాదాలు కూడా మార్మోగుతున్నాయి. కట్ చేస్తే.. ఈ యువగళానికి సంబంధించి ఇంత భారీ మద్దతు వస్తుందని పార్టీ నాయకులు కూడా ఊహించి ఉండరనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే.. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో వీరంతా ఓటు బ్యాంకుగా మారతారా? అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. కొన్ని లోటుపాట్లు పార్టీలోనే కనిపిస్తున్నాయి. దీంతో వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇక, తొలిరోజే ఒకరిద్దరు నాయకులు అంతర్గత సమావేశాల్లో సమస్యలపై ప్రస్తావించారు.
పార్టీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టులు తప్పుగా ఇస్తున్నారని.. వాస్తవాలను చెప్పడం లేదని వారు అన్నారు. మరి వాటిని సరిదిద్దే కార్యక్రమానికి .. నారా లోకేష్ ప్రయత్నిస్తే బాగుండేదని అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి చేసి.. పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
This post was last modified on February 1, 2023 11:03 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…