Political News

బ‌ల‌మైన జిల్లాల్లో బ‌ల‌హీన‌మవుతున్న వైసీపీ..!

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజృంభించిన విష‌యం తెలిసిందే. టీడీపీకి కంచుకోట‌లు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభ‌య గోదావ‌రులు, నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మ‌రీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక‌, క‌డ‌ప‌లో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , క‌ర్నూలలోనూ విజ‌యం ద‌క్కించుకుంది.

అయితే.. ఇది గ‌తం! కానీ, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. టీడీపీకి బ‌ల‌మైన జిల్లాల్లో వైసీపీ బ‌లోపేతం అయింద‌నే వాద‌న నుంచి ఇప్పుడు బ‌ల‌హీన ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కూడా వైసీపీ అధిస్టాన‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో వేస్తున్న అడుగులు.. స‌రిగా లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణం.

నిజానికి ఇప్పుడున్న నాయ‌కుల‌కు టికెట్ ఇస్తారో లేదో తెలియ‌దు. పైకి ఇస్తామ‌ని అంటున్నా.. చివరి నిముషంలో రాష్ట్రంలో చోటు చేసుకునే పొత్తుల నేప‌థ్యంలోనే వైసీపీలోనూ టికెట్ల పందేరం ఉంటుంది. కాబ‌ట్టి.. వైసీపీ అధిష్టానంపై కొంద‌రు నాయ‌కులు సానుకూలంగా లేక‌పోవ‌డం.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా క‌నిపిస్తోంది. అందుకే.. పార్టీ ఒకింత బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ.. ఇప్పుడు ఎదురీత త‌ప్ప‌డం లేదు.

నెల్లూరు జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాలో పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ సీఎం కావ‌డ‌మే ల‌క్ష్యంగా ఇక్క‌డి నాయ‌కులు అప్ప‌ట్లో క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేశారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్తితిలేదు. క‌ల‌సి క‌ట్టుగా కొట్టుకునే ప‌రిస్థితి ఉంది. ఇటీవ‌ల వైసీపీ నాయ‌కుడు ఒక‌రు మాట్లాడుతూ ..`కొన్ని జిల్లాల్లో మాకు ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం లేదు.

మాలోనే మాకు దిమ్మ‌తిరిగిపోయే ప్ర‌తిప‌క్ష నాయ‌కు లు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. సో.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌రిస్థితి ఇలానే ఉంది. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో.. పార్టీ ప‌రిస్థితి ఎలాంటి మ‌లుపుతిరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

1 hour ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

1 hour ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

4 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

5 hours ago