Political News

బ‌ల‌మైన జిల్లాల్లో బ‌ల‌హీన‌మవుతున్న వైసీపీ..!

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజృంభించిన విష‌యం తెలిసిందే. టీడీపీకి కంచుకోట‌లు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభ‌య గోదావ‌రులు, నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మ‌రీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక‌, క‌డ‌ప‌లో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , క‌ర్నూలలోనూ విజ‌యం ద‌క్కించుకుంది.

అయితే.. ఇది గ‌తం! కానీ, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. టీడీపీకి బ‌ల‌మైన జిల్లాల్లో వైసీపీ బ‌లోపేతం అయింద‌నే వాద‌న నుంచి ఇప్పుడు బ‌ల‌హీన ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కూడా వైసీపీ అధిస్టాన‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో వేస్తున్న అడుగులు.. స‌రిగా లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణం.

నిజానికి ఇప్పుడున్న నాయ‌కుల‌కు టికెట్ ఇస్తారో లేదో తెలియ‌దు. పైకి ఇస్తామ‌ని అంటున్నా.. చివరి నిముషంలో రాష్ట్రంలో చోటు చేసుకునే పొత్తుల నేప‌థ్యంలోనే వైసీపీలోనూ టికెట్ల పందేరం ఉంటుంది. కాబ‌ట్టి.. వైసీపీ అధిష్టానంపై కొంద‌రు నాయ‌కులు సానుకూలంగా లేక‌పోవ‌డం.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా క‌నిపిస్తోంది. అందుకే.. పార్టీ ఒకింత బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ.. ఇప్పుడు ఎదురీత త‌ప్ప‌డం లేదు.

నెల్లూరు జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాలో పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కార‌ణం.. జ‌గ‌న్ సీఎం కావ‌డ‌మే ల‌క్ష్యంగా ఇక్క‌డి నాయ‌కులు అప్ప‌ట్లో క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేశారు. అయితే.. ఇప్పుడు ఆ ప‌రిస్తితిలేదు. క‌ల‌సి క‌ట్టుగా కొట్టుకునే ప‌రిస్థితి ఉంది. ఇటీవ‌ల వైసీపీ నాయ‌కుడు ఒక‌రు మాట్లాడుతూ ..`కొన్ని జిల్లాల్లో మాకు ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం లేదు.

మాలోనే మాకు దిమ్మ‌తిరిగిపోయే ప్ర‌తిప‌క్ష నాయ‌కు లు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. సో.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌రిస్థితి ఇలానే ఉంది. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో.. పార్టీ ప‌రిస్థితి ఎలాంటి మ‌లుపుతిరుగుతుందో చూడాలి.

This post was last modified on February 1, 2023 9:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago