గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజృంభించిన విషయం తెలిసిందే. టీడీపీకి కంచుకోటలు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవరూ ఊహించని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభయ గోదావరులు, నెల్లూరు, కర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మరీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక, కడపలో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , కర్నూలలోనూ విజయం దక్కించుకుంది.
అయితే.. ఇది గతం! కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తే.. భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీకి బలమైన జిల్లాల్లో వైసీపీ బలోపేతం అయిందనే వాదన నుంచి ఇప్పుడు బలహీన పడుతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వైసీపీ అధిస్టానమే కారణమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేసే క్రమంలో వేస్తున్న అడుగులు.. సరిగా లేకపోవడం ప్రధాన కారణం.
నిజానికి ఇప్పుడున్న నాయకులకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు. పైకి ఇస్తామని అంటున్నా.. చివరి నిముషంలో రాష్ట్రంలో చోటు చేసుకునే పొత్తుల నేపథ్యంలోనే వైసీపీలోనూ టికెట్ల పందేరం ఉంటుంది. కాబట్టి.. వైసీపీ అధిష్టానంపై కొందరు నాయకులు సానుకూలంగా లేకపోవడం.. ఇటీవల కాలంలో తరచుగా కనిపిస్తోంది. అందుకే.. పార్టీ ఒకింత బలంగా ఉందని అనుకుంటున్న నియోజకవర్గాలలోనూ.. ఇప్పుడు ఎదురీత తప్పడం లేదు.
నెల్లూరు జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాలో పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీనికి కారణం.. జగన్ సీఎం కావడమే లక్ష్యంగా ఇక్కడి నాయకులు అప్పట్లో కలసి కట్టుగా పనిచేశారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్తితిలేదు. కలసి కట్టుగా కొట్టుకునే పరిస్థితి ఉంది. ఇటీవల వైసీపీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ..`కొన్ని జిల్లాల్లో మాకు ప్రతిపక్షం అవసరం లేదు.
మాలోనే మాకు దిమ్మతిరిగిపోయే ప్రతిపక్ష నాయకు లు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. సో.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరి చివరకు ఏం చేస్తారో.. పార్టీ పరిస్థితి ఎలాంటి మలుపుతిరుగుతుందో చూడాలి.
This post was last modified on February 1, 2023 9:44 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…