Political News

కరోనా…16 రోజుల్లో ఒకే కుటుంబంలోని ఆరుగురి మృతి

మానవత్వంతో పాటు కాస్త అప్రమత్తత లేకుంటే కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపిన ఘటన జార్ఘండ్ లో జరిగింది. అనారోగ్యం బారినపడి చనిపోయిన తమ తల్లి అంత్యక్రియలను నిర్వహించిన ఐదుగురు కొడుకులు కరోనాతో మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఆమెకు కరోనా ఉందని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ ఐదుగురు మరణించారు.

కరోనాతో ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కాట్రాస్‌కు చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలోని తన కొడుకు దగ్గర ఉండేది. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు జూన్ చివరిలో ధన్‌బాద్ వెళ్లిన ఆ మహిళ… కాట్రాస్‌లోని స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ అనారోగ్యం పాలైన ఆమె బొకారోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 4న కన్నుమూసింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అయితే, ఆ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలీదు. ఆమెది సాధారణమరణంగా భావించిన ఆమె ఐదుగురు కొడుకులు…ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే ఆమె అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వర్తించారు. అంత్యక్రియలు పూర్తయిన కొద్ది రోజులకు ఆమె కరోనా సోకి మరణించిందని తేలింది. దీంతో, ఆమె ఐదుగురు కొడుకులు కూడా కరోనా బారినపడ్డారు.

జులై 4 నుంచి జూలై 20 మధ్యలో ఆ ఐదుగురు… ఒక్కొక్కరిగా మృత్యువాత పడ్డారు. ఈ అయిదుగురి వయసూ 60 ఏళ్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మహిళ సంతానంలో ఢిల్లీలో ఉన్న కొడుకు ఒక్కడే మిగిలాడు. 16 రొోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోవడంతో ధన్ బాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అధికారులు ధన్‌బాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కరోనా కాలంలో చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేటపుడు అన్ని జాగ్రత్తలు పాటించాలని, సాధారణ మరణమైనా…జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కరోనా టెస్టుల ఫలితాల వెల్లడిలో అవుతున్న జాప్యం వల్ల కూడా ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on July 22, 2020 7:37 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

2 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

3 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago