Political News

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

వార్షిక బడ్జెట్ వచ్చేస్తోంది. మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుల్లో ఆదాయపన్ను పరిమితిని గతంలోలాగే రెండున్నర లక్షలుగా కొనసాగిస్తూ, శ్లాబులను మాత్రం మార్చనున్నారని విశ్వసిస్తున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి మరో 15 నుంచి 25 వేల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద ఇచ్చే రాయితీని లక్షన్నర నుంచి ఇంకాస్త పెంచబోతున్నారు.

పేద, గ్రామీణ వర్గాలకు ప్రోత్సాహకాలు
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే ప్రకటనలు ఉండొచ్చు. సామాజిక భద్రతా కార్యక్రమాలకు కూడా ఊతమివ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు గ్రామీణ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో పేద, మధ్య తరగతి వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలతో పాటు నష్టాల్లో ఉన్న స్టార్టప్‌లను ఆదుకుంటారని చెబుతున్నారు.

దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు స్టాంప్ డ్యూటీ తగ్గించబోతున్నారు. ఇళ్ల తాకట్టుపై వడ్డీ రాయితీని రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలన్న డిమాండ్ పరిశీలించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని రెండు రాష్ట్రాల ఆర్థికవేత్తలంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆశలు వదుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కేంద్రం ఈ సారైనా స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి. పేదల ఆహార భద్రత విషయంలో కేంద్రం శీతకన్నేసిందని ఏపీ ప్రభుత్వం వాపోతోంది. అదనంగా నెలకు 77 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని కేటాయించాలని ఏపీ కోరుతోంది. విశాఖ మెట్రో రైలు ఈ సారి కూడా ఎండమావు కాకూడదని జనం ఎదురు చూస్తున్నారు. నత్తనడక నడుస్తున్న ప్రాజెక్టులకు ఆర్థిక వనరులివ్వాలని ఏపీ కోరుతోంది.

విభజన చట్టం హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎదురు చూస్తోంది. గతేడాది ప్రస్తావించిన 35 డిమాండ్ల ఈ సారి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఆశించిన మేరకు ఉండక పోవచ్చన్నది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.

This post was last modified on January 31, 2023 9:15 pm

Share
Show comments
Published by
satya
Tags: Budget

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

5 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

6 hours ago