Political News

ఏమిటీ ఎదురుదెబ్బలు.. జగన్ పార్టీ నేతల్లో అంతర్మధనం

కొన్నిసార్లు అంతే.. ఏం చేసినా అడ్డే ఉండదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తిరుగు ఉండనట్లుగా ఉంటుంది. కానీ.. ఒక్కసారి సీన్ మారిపోతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన షాకులతో పాటు.. తాజాగా ఎదురవుతున్న సవాళ్లతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీ అధికార పక్షానికి అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అన్ని వైపుల నుంచి ఏదో ఒక ఒత్తిడి రావటం.. ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది లేదన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు వ్యాఖ్యానించుకోవటం కనిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పలువురికి కరోనా పాజిటివ్ గా తేలటం కొత్త విషయం కాకున్నా.. జగన్ కు తలలో నాలుకలా.. ఆయన నీడలా వ్యవహరించే విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ తేలటంతో పార్టీ వర్గాలు షాక్ కు గురయ్యాయి.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకురావటం.. అపోలో ఆసుపత్రిలో చేర్చటం ఆసక్తికరంగా మారింది. నిన్నటికి నిన్న శిరోముండనం వ్యవహారంతో పాటు.. రాష్ట్రపతి కోవింద్ ను పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కమ్ రెబల్ అయిన రఘురామ రాజు భేటీ కావటం.. బయటకువచ్చిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి.

ఇవి సరిపోన్నట్లు ఈ రోజు విషయానికి వస్తే.. నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గవర్నర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మధ్యనే రాష్ట్ర హైకోర్టు ప్రభు్త్వాన్ని మొట్టికాయలు వేయటం తెలిసిందే. గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో తాజాగా ఆదేశం ప్రభుత్వానికి మింగుడుపడనిది మారిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇదిలా ఉండగా.. ప్రకాశం జిల్లా చీరాలలో ఒక వ్యక్తిపై స్థానిక పోలీసులు దౌర్జన్యానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటివరకూ ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవంటూ జగన్ భేష్ అనే వారు సైతం మాటల కోసం వెతుక్కునేలా రోజుకు పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో ఐదు వేల కేసుల వరకూ నమోదంటే.. మామూలు విషయం కాదు. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. అన్ని కోణాల్లోనూ జగన్ వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకోవటంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ఏమిటీ ఎదురుదెబ్బలన్న మాట పలువురు నేతల నోటి నుంచి రావటం గమనార్హం.

This post was last modified on July 22, 2020 3:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 mins ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

24 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

3 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

4 hours ago