Political News

త్వ‌ర‌లోనే విశాఖ రాజ‌ధాని: సీఎం జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం ఏపీకి పాల‌నా రాజ‌ధాని అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే తాను విశాఖ ప‌ట్నానికి మ‌కాం మారుస్తున్న‌ట్టు కూడా చెప్పేశారు. విశాఖ‌కు పెట్టుబ‌డుల వ‌ర‌ద పారాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనేన‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ వేదిక‌ల‌పై ఏపీని నిల‌బెట్ట‌డానికి శ‌త‌థా కృషి చేస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం సోమ‌వారం రాత్రి విజ‌య‌వాడ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌న్నాహక స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లింది. కాగా, ఈ సమావేశానికి వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజ‌ర‌య్యారు.

ఏపీలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న పరిశ్ర‌మ‌ల‌కు పెద్ద‌పీట వేస్తోంద‌ని చెప్పారు. అనుమ‌తుల నుంచి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వ‌ర‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌న్నారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని విష‌యాన్ని అనూహ్యంగా ఆయ‌న ప్ర‌స్తావించారు. రాజ‌ధాని స‌హా.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కూడా విశాఖ‌కు త‌ర‌లి పోతుంద‌ని.. దీనికి ఎంతో స‌మ‌యం లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక‌వైపు ఈ రోజు సుప్రీంలో అమ‌రావ‌తి రాజ‌ధాని పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

This post was last modified on January 31, 2023 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

17 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago