తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓ ముసలాయన ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా కూడా ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి కామెంట్లు చేయలేదు. అయితే.. వ్యూహాత్మకంగా ఇప్పటికే అనేక రూపాల్లో టీడీపీపై మాటలదాడి చేసిన జగన్.. అండ్ కోలు.. అవేవీ పెద్దగా ఫలించకపోవడంతో ఏజ్ ఫ్యాక్టర్ రాజకీయాలను తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా సీఎం నోటి వెంట ముసలి అనే మాట వచ్చింది. నిజానికి ఇదే కనుక ప్రచారం చేస్తే.. అది పరోక్షంగాటీడీపీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. యువ నాయకుడిగా జగన్ రాష్ట్రానికి ఏం చేశారనేది ప్రశ్నించుకుంటే.. అప్పులు చేయడం.. పంచడం మినహా ఏమీ కనిపించడం లేదు. పైగా.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్కు వచ్చి వెళ్లినట్టు పనిచేస్తున్నారు.
పైగా, పండగలు, సెలవు దినాలు, ఆదివారాలను ఆయన పుష్కలంగా.. అంటే.. ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇలా వాడుకోని రీతిలో(ఎందుకంటే.. ఒక్కొక్కసారి వారు కూడా పండుగలు సెలవు దినాల్లో పనిచేయాల్సి వస్తోంది) ఆయన వాడుకుంటున్నారు. ఇలా గూటిలోంచి బయటకు వచ్చి.. అలా గూటిలోకి వెళ్లిపోయినచందంగా.. ఇంట్లోనే ఆఫీసు పెట్టుకుని.. ఎవరినైనా అక్కడికే పిలుచుకుని చర్చించి.. కథ ముగించేస్తున్నారు. నిజానికి ప్రజలు ఇలానే కోరుకున్నారా? అనేది ప్రశ్న.
యువ నేతగా.. ప్రజల మధ్య పట్టుమని పది రోజులుకూడా జగన్ లేరనేది.. అందరికీ తెలిసిన సత్యం. అంతేకాదు.. పైగా యువ నాయకుడుగా దేశాలు తిరిగి.. లేదా రాష్ట్రాలు తిరిగి ఆయన ఏపీకి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించుకుంటే.. కూడా ఏమీ మిగలదు. ఈ నేపథ్యంలో ముసలి వ్యక్తే అయినా.. ముసలి నాయకుడే అయినా.. పనిచేసే నాయకుడు తమకు కావాలని అనుకుంటే.. జ్యోతి బసు మాదిరిగా.. చంద్రబాబువైపు ప్రజలు మనసు పెట్టుకుంటే.. అప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
This post was last modified on January 30, 2023 4:47 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…