టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్యన్నాపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ను ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీఐడీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన విజయ్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలిసింది. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్కు సీఐడీ నోటీసులు ఇవ్వాగా… విచారణ నిమిత్తం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్బంగా సీఐడీ అధికారులు ఆయనను అన్ని రూపాల్లోనూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ భారతి పే యాప్ను ఎవరు రూపొందించారు? దీని వెనుక ఎవరున్నారు? నారా లోకేష్తో ఉన్న సంబంధం ఏంటి? ఈ యాప్ ద్వారా సీఎం జగన్ సతీమణిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్పటి వరకు పెట్టిన పోస్టులు.. వాటిపై కామెంట్లు? ఇలా.. అన్ని రూపాల్లోనూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
ఇదిలావుంటే, గతేడాది సెప్టెంబరులో విజయ్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా విజయ్కు సీఆర్పీసీ 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 30న సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. కోర్టు సూచన మేరకు విజయ్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఎంపీకి లేని అడ్డంకి.. విజయ్కు!
మరోవైపు.. చింతకాయల విజయ్ వెంట మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అయితే మాజీ మంత్రులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు వీలు లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అయితే.. ఇటీవల రెండు రోజుల కిందట వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులుహైదరాబాద్లో విచారించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన వెంట వెళ్లారు. అప్పట్లో ఎవరూ వీరికి అడ్డు చెప్పలేదు. కానీ, ఈ రోజు మాత్రం టీడీపీనేత వెంట ఉన్న వారికి అడ్డు చెప్పడం గమనార్హం.
This post was last modified on January 30, 2023 4:25 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…