ఇదేదో.. పార్టీ కార్యకర్తలో కీలక నేతలో ఇచ్చిన పిలుపుకాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయాల్సిన ఓ అధికారి.. డ్వాక్రా మహిళలకు జారీ చేసిన సంచలన ఆదేశాలు. అంతేకాదు.. ఇలా చేయకపోతే.. భవిష్యత్తులో మీకు రుణాలు దక్కవు! అని కూడా ఆదేశాలు ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఆదేశాలు వైరల్ అవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎం ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజుపై స్వామిభక్తిని చాటుకున్నాడు. తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి అనే మాట మరిచిపోయి మరీ.. మంత్రిగారు వస్తారు.. ఆయనపై పూల జల్లు కురిపించండి.. అంటూ డ్వాక్రా మహిళలకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. సీఎం జగన్, మంత్రి అప్పలరాజుపై ఏపీఎం చేసిన పొగడ్తల వర్షం.. స్థానిక మహిళలను ఆశ్చర్యానికి గురిచేసింది.
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం(మంత్రి సీదిరి సొంత నియోజకర్గం) జిల్లుండ గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకోసం సన్నద్దం కావాలంటూ.. డిమిరియా గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఏపీఎం ప్రసాదరావు సమావేశమయ్యారు. మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మంత్రి వచ్చినప్పుడు ఇలా చేయండి.. అలా చేయండని సూచించారు.
మంత్రి వస్తున్న కార్యక్రమానికి పట్టు చీరలు కట్టుకుని రావాలని ఆదేశించారు. మంత్రి రాగానే ఆయనపై పూలు చల్లాలని, నవ్వుతూ ఉండాలని వారికి సూచనలిచ్చారు. కుదిరితే ఒకరిద్దరు హారతులు పట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా మంత్రి సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు కూడా కొట్టాలని ఆదేశాలు చేశారు. ఇదంతా చూసిన సమావేశంలో కొందరు మాహిళలు, గ్రామస్థులు ఆయనపై విమర్శలు చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగా, వైసీపీ కార్యకర్తవా అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన సదరు అధికారి.. ఆ మహిళల వివరాలను నమోదు చేసుకుని వెళ్లడం గమనార్హం.
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…