వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని.. తనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలునిఘా పెట్టాయని.. ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
“నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా?.. నా దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్లో మాట్లాడితే ఏం చేయగలరు?.. ఏపీ పోలీసు బాసు కూడా నన్ను ఏమీ చేయలేరు. 35ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా… ఎప్పుడు ఏం చేయాలో తెలుసు” అని హెచ్చరించే ధోరణిలో కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
తన ఫోన్ను ట్యాప్ చేశారని, ఇలా చేయడం సమంజసం కాదని అన్నారు. కాగా, గతంలోనూ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై ఒకసారి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం ఒక్కసారిగా సంచలనం రేపింది. నేరుగా ఆయన ఒక మురుగునీటి కాలువలో కూర్చుని.. తన నియోజకవర్గంలో అన్నీ ఇలానే ఉన్నాయంటూ నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కూడా తాను మురుగునీటి కుంటలోంచి లేచేది లేదన్నారు.
ఇక, ఇటీవల తన నియోజకవర్గంలో పింఛన్ల కోతపై బాహాటంగానే విరుచుకుపడ్డారు. పింఛన్లు కోత పెట్టడం అనేది ఎక్కడా లేదన్నారు. గతంలో వైఎస్ హయాంలో పింఛన్లు పొందిన వారు ఉన్నారని.. ఇప్పుడు తీసేసే వారు ఎక్కువగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సొంత పార్టీ వైసీపీకి చెందిన నాయకులే తనను బలహీన పరచడానికి కుట్ర పన్నుతున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కక పోవడంపైనా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. కోటంరెడ్డి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 30, 2023 6:41 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…