సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. టాప్ 10లో ప్రజాదరణ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మిస్ కావటం గమనార్హం. గత ఏడాది మొదట్లో నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది మలి విడత నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా.. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న యోగి ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం.
తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో 73.2 శాతం ఆదరణతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిస్తే.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిలిచారు. నాలుగో స్థానంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలవగా.. ఐదో స్థానంలో శివరాజ్ సింగ్ నిలిచారు. ఆరో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఫుష్కర్ ధామి.. ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు.
ఎనిమిది.. తొమ్మిది.. పది స్థానాల విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 45.7 శాతం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 43.6 శాతం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 39.7 శాతంతో పట్టికలో చివర్లో నిలిచారు. కానీ.. దేశాన్ని ఏలేద్దామని జాతీయ పార్టీన పెట్టిన కేసీఆర్ మాత్రం జాబితాలోనే కనిపించకపోవటం గమనార్హం. దేశాన్ని ఏలటం తర్వాత తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంపై కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెంచితే మంచిదన్న మాట వినిపిస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…