సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. టాప్ 10లో ప్రజాదరణ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మిస్ కావటం గమనార్హం. గత ఏడాది మొదట్లో నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది మలి విడత నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా.. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న యోగి ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం.
తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో 73.2 శాతం ఆదరణతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిస్తే.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిలిచారు. నాలుగో స్థానంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలవగా.. ఐదో స్థానంలో శివరాజ్ సింగ్ నిలిచారు. ఆరో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఫుష్కర్ ధామి.. ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు.
ఎనిమిది.. తొమ్మిది.. పది స్థానాల విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 45.7 శాతం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 43.6 శాతం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 39.7 శాతంతో పట్టికలో చివర్లో నిలిచారు. కానీ.. దేశాన్ని ఏలేద్దామని జాతీయ పార్టీన పెట్టిన కేసీఆర్ మాత్రం జాబితాలోనే కనిపించకపోవటం గమనార్హం. దేశాన్ని ఏలటం తర్వాత తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంపై కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెంచితే మంచిదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 30, 2023 6:34 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…