సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. టాప్ 10లో ప్రజాదరణ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మిస్ కావటం గమనార్హం. గత ఏడాది మొదట్లో నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది మలి విడత నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా.. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న యోగి ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం.
తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో 73.2 శాతం ఆదరణతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిస్తే.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిలిచారు. నాలుగో స్థానంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలవగా.. ఐదో స్థానంలో శివరాజ్ సింగ్ నిలిచారు. ఆరో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఫుష్కర్ ధామి.. ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు.
ఎనిమిది.. తొమ్మిది.. పది స్థానాల విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 45.7 శాతం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 43.6 శాతం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 39.7 శాతంతో పట్టికలో చివర్లో నిలిచారు. కానీ.. దేశాన్ని ఏలేద్దామని జాతీయ పార్టీన పెట్టిన కేసీఆర్ మాత్రం జాబితాలోనే కనిపించకపోవటం గమనార్హం. దేశాన్ని ఏలటం తర్వాత తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంపై కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెంచితే మంచిదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 30, 2023 6:34 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…