సమకాలీన రాజకీయాలు.. రాజకీయ పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు లోతుగా సర్వేలు.. అధ్యయనాలు చేసే మీడియా సంస్థగా ఇండియా టుడే సంస్థకు మంచి పేరు ఉంది. సీ ఓటరుతో కలిసి కొన్నేళ్లుగా ఈ సంస్థ అధ్యయనం చేయటంతో పాటు.. జాతీయ.. రాష్ట్రాల రాజకీయాల మీద విశ్లేషణ చేయటం తెలిసిందే. తాజాగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణలో ముందున్న ముఖ్యమంత్రులు ఎవరన్న సర్వేను చేపట్టారు. దీనికి సంబంధించిన సర్వే ఫలితాల్ని తాజాగా ఇండియా టుడే సంస్థ వెల్లడించింది.
ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే.. టాప్ 10లో ప్రజాదరణ ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మిస్ కావటం గమనార్హం. గత ఏడాది మొదట్లో నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంతం చేసుకుంటే.. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. గత ఏడాది మలి విడత నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రి స్థానంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలవగా.. అంతకు ముందు మొదటి స్థానంలో ఉన్న యోగి ఏకంగా ఏడో స్థానానికి దిగజారటం గమనార్హం.
తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో 73.2 శాతం ఆదరణతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిస్తే.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నిలిచారు. నాలుగో స్థానంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలవగా.. ఐదో స్థానంలో శివరాజ్ సింగ్ నిలిచారు. ఆరో స్థానంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఫుష్కర్ ధామి.. ఏడో స్థానంలో యూపీ సీఎం యోగి నిలిచారు.
ఎనిమిది.. తొమ్మిది.. పది స్థానాల విషయానికి వస్తే.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 45.7 శాతం.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 43.6 శాతం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 39.7 శాతంతో పట్టికలో చివర్లో నిలిచారు. కానీ.. దేశాన్ని ఏలేద్దామని జాతీయ పార్టీన పెట్టిన కేసీఆర్ మాత్రం జాబితాలోనే కనిపించకపోవటం గమనార్హం. దేశాన్ని ఏలటం తర్వాత తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అయినా ప్రజాదరణను సొంతం చేసుకునే విషయంపై కేసీఆర్ కాస్తంత ఫోకస్ పెంచితే మంచిదన్న మాట వినిపిస్తోంది.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…