Political News

అమూల్ మాటున జ‌గ‌న్ ఆర్థిక దోపిడీ.. లోకేష్

ఏపీలో ప్ర‌వేశ పెట్టిన అమూల్ పాల డెయిరీ మాటున సీఎం జ‌గ‌న్ ఆర్థిక దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పంలో మూడో రోజు ఆదివారం కూడా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక‌ పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల క‌ష్టాలు విన్నారు. ఓపిక‌గా వాట‌న్నింటినీ.. రికార్డు చేసుకున్నారు. అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ.. అమూల్ రాక‌తో.. రాష్ట్రంలో పాడి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామని నారా లోకేష్ చెప్పారు. అప్ప‌ట్లో పాడి రైతులకు సబ్సిడీపై దాణా, సైలేజ్(ఎండు గ‌డ్డి) తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని చెప్పిన జ‌గ‌న్‌.. రైతుల‌ను మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు, ఒంగోలు డైయిరీలను అమూల్‌ డైరీకి కట్టబెట్టారని, రూ.650 కోట్ల విలువైన చిత్తూరు డైయిరీని అమూల్‌కి కట్టబెట్టడం ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందార‌ని విమ‌ర్శించారు. రైతుల పేరుతో రూ.3 వేల కోట్లు అప్పుతీసుకొని అమూల్‌కి కట్టబెడుతున్నారని, దీనిలోనూ క‌మీష‌న్లు బొక్కేశార‌ని లోకేష్‌ దుయ్యబట్టారు. పాడి రైతుల పేరుతో జగన్‌రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్‌ సర్కార్‌ ఉందని విమర్శించారు. పాడిరైతులకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెరిగేలా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago