ఏపీలో ప్రవేశ పెట్టిన అమూల్ పాల డెయిరీ మాటున సీఎం జగన్ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర కుప్పంలో మూడో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల కష్టాలు విన్నారు. ఓపికగా వాటన్నింటినీ.. రికార్డు చేసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. అమూల్ రాకతో.. రాష్ట్రంలో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామని నారా లోకేష్ చెప్పారు. అప్పట్లో పాడి రైతులకు సబ్సిడీపై దాణా, సైలేజ్(ఎండు గడ్డి) తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్ పాలకు రూ.4 బోనస్ ఇస్తామని చెప్పిన జగన్.. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు, ఒంగోలు డైయిరీలను అమూల్ డైరీకి కట్టబెట్టారని, రూ.650 కోట్ల విలువైన చిత్తూరు డైయిరీని అమూల్కి కట్టబెట్టడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందారని విమర్శించారు. రైతుల పేరుతో రూ.3 వేల కోట్లు అప్పుతీసుకొని అమూల్కి కట్టబెడుతున్నారని, దీనిలోనూ కమీషన్లు బొక్కేశారని లోకేష్ దుయ్యబట్టారు. పాడి రైతుల పేరుతో జగన్రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉందని విమర్శించారు. పాడిరైతులకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెరిగేలా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు.
This post was last modified on January 30, 2023 6:16 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…