Political News

అమూల్ మాటున జ‌గ‌న్ ఆర్థిక దోపిడీ.. లోకేష్

ఏపీలో ప్ర‌వేశ పెట్టిన అమూల్ పాల డెయిరీ మాటున సీఎం జ‌గ‌న్ ఆర్థిక దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ యువ నాయ‌కుడు మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పంలో మూడో రోజు ఆదివారం కూడా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక‌ పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల క‌ష్టాలు విన్నారు. ఓపిక‌గా వాట‌న్నింటినీ.. రికార్డు చేసుకున్నారు. అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ.. అమూల్ రాక‌తో.. రాష్ట్రంలో పాడి రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ హయాంలో పాడి రైతులకు అండగా నిలిచామని నారా లోకేష్ చెప్పారు. అప్ప‌ట్లో పాడి రైతులకు సబ్సిడీపై దాణా, సైలేజ్(ఎండు గ‌డ్డి) తక్కువ రేటుకే అందించామని తెలిపారు. వైసీపీ పాలనలో సబ్సిడీలు లేవని, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని తప్పుబట్టారు. లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని చెప్పిన జ‌గ‌న్‌.. రైతుల‌ను మోసం చేశారని మండిపడ్డారు. పాడి పరిశ్రమపై జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సహకార సంఘాల డైయిరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు, ఒంగోలు డైయిరీలను అమూల్‌ డైరీకి కట్టబెట్టారని, రూ.650 కోట్ల విలువైన చిత్తూరు డైయిరీని అమూల్‌కి కట్టబెట్టడం ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందార‌ని విమ‌ర్శించారు. రైతుల పేరుతో రూ.3 వేల కోట్లు అప్పుతీసుకొని అమూల్‌కి కట్టబెడుతున్నారని, దీనిలోనూ క‌మీష‌న్లు బొక్కేశార‌ని లోకేష్‌ దుయ్యబట్టారు. పాడి రైతుల పేరుతో జగన్‌రెడ్డి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గోపాలమిత్రలకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో జగన్‌ సర్కార్‌ ఉందని విమర్శించారు. పాడిరైతులకు పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెరిగేలా.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రణాళిక సిద్ధం చేస్తామని నారా లోకేష్‌ ప్రకటించారు.

This post was last modified on January 30, 2023 6:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

1 hour ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

2 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

4 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

5 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

5 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

5 hours ago