Political News

ఆత్మబంధువు కోసమే జగన్ ఢిల్లీ టూర్?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్న వేళ.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటుందన్న అంచనాలు నిజం అయినట్లేనని చెబుతున్నారు.

వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఢిల్లీకి టూర్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ లో భాగంగా ఆయన పర్యటించాల్సిన విశాఖ.. పొన్నూరు.. హైదరాబాద్ కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న జగన్.. మంగళవారం జీ20 సన్నాహక సదస్సులో పాల్గొంటారని చెబుతున్నారు. ఒకవేళ.. అలాంటిదే ఉండి ఉంటే.. ఇప్పటివరకు బయటపెట్టకుండా.. హటాత్తుగా ఈ కార్యక్రమాల్ని తెర మీదకు తీసుకురావటం ఏమిటి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం అయిన నేపథ్యంలో తన ఆత్మబంధువు.. సోదరుడు వరుసైన అవినాశ్ విషయంలో ఏమైనా చేసేందుకు వీలు ఉంటుందా? అన్న కోణంలోనే ఢిల్లీ పర్యటన ఉందని చెబుతున్నారు.

ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే.. ఢిల్లీకి వస్తున్న సీఎం జగన్ కు మోడీషాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వటం ద్వారా తాము ఇరుకునపడే అవకాశం ఉందని.. అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తారా? లేదంటే.. తమకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించే జగన్ పరిస్థితిని అర్థం చేసుకొని అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

This post was last modified on January 29, 2023 9:17 am

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago