Political News

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ దూకుడు.. ఏ రేంజ్‌లో అంటే!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఓ రేంజ్‌లో పుంజుకుంది. రెండు జిల్లాల్లోనూ క‌లిపి మొత్తం 30 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ఐదు చోట్ల మాత్ర‌మే విజయం ద‌క్కించుకున్న టీడీపీ ఈ మూడున్న‌రేళ్ల‌లో భారీగా పుంజుకుంద‌ని తాజా అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి రెండు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాల్లోనూ టీడీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అయితే.. గ‌త వైసీపీ దూకుడు, జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో టీడీపీ ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది.

అయితే.. జ‌గ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్న కాపు నాయ‌కులు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కూడా ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఐప్యాక్ స‌హా టీడీపీ చేయించిన స్వ‌తంత్ర స‌ర్వేల్లోనూ వైసీపీకి ఎదురు గాలి వీస్తుండ‌గా.. టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి 42 శాతం నుంచి 48 శాతం వ‌ర‌కు ఓటు బ్యాంకు క‌నిపిస్తోంది.

అదికూడా పార్టీ ఒంట‌రిగా పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యానికి అవ‌కాశం మెరుగుప‌డిన‌ట్టు చెబుతున్నారు. ముమ్మిడివ‌రం, పెద్దాపురం, అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ మెజారిటీ ఓటు బ్యాంకును కైవ‌సం చేసుకుంది. ఇక‌, సిట్టింగ్ స్థానాలైన రాజ‌మండ్రి రూర‌ల్‌, రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌చ్చితంగా మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేదిశ‌గా టీడీపీ వేగంగా ప‌రుగులు పెడుతోంది. ఇక‌, కాకినాడ సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య ఫైట్ భీక‌రంగా ఉంద‌ని తెలుస్తొంది.

ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ రెండు పార్టీల మ‌ధ్య పోరు తీవ్రంగానే సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. దెందులూరు, పాలకొల్లు, ఉండి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దెందులూరులో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విజ‌యం రాసిపెట్టుకోవచ్చ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇక‌, గోపాల‌పురం ఎస్పీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఈ ద‌ఫా విజ‌యం టీడీపీదేన‌ని అంటున్నారు. అయితే, ఏలూరు అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల్లో మాత్రం పోటీ త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఏదేమైనా.. గ‌త ఎన్నిక‌ల‌తోపోల్చుకుంటే.. టీడీపీ జోరుగా పుంజుకుంద‌ని పార్టీ అంచ‌నా వేసింది.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago