Political News

ఇక మొద‌లు.. యువ‌గ‌ళంపై కేసులే కేసులు!!

టీడీపీ నాయ‌కులు ఏ కార్య‌క్రమం చేస్తున్నా.. పోలీసులు లాఠీల‌తో విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. కీల‌క నేత‌ల‌ను, మాజీ మంత్రుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు.. కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల అనుచ‌రుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో సింప‌తీ వ‌చ్చే ఏ కార్య‌క్ర‌మాన్ని కూడా వారు వ‌దిలి పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పైనా పోలీసులు విరుచుకుప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. కుప్పంలో నారా లోకేష్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన యువ‌గ‌ళం పాదయాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం ఎస్ఐ శివకుమార్‌ ఫిర్యాదు చేశార‌ని, దీంతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశామ‌ని పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే, యువగళం పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లి వ‌స్తున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నార‌ని.. పార్టీ నేత‌లు అనుమానిస్తున్నారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో సంఘ విద్రోహ శ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని.. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు వ్యాఖ్యానించ‌డం.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది. సంఘ విద్రోహులు అంటే ఎవ‌రంటూ.. పోలీసుల‌ను నాయ‌కులు ప్ర‌శ్నించారు.

ఇదిలావుంటే.. తాము ఇచ్చిన అనుమ‌తుల‌ను యువ‌గ‌ళం నేత‌లు ఎవ‌రూ కూడా పాటించ‌డం లేద‌ని.. పోలీసులు వ్యాఖ్యానించారు. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌స్తున్నార‌ని.. ఇంత మందిని అనుమ‌తించేందుకు నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని కూడా పోలీసులు హెచ్చ‌రించారు. అంటే.. దీనిని బ‌ట్టి యువ‌గ‌ళంపై పోలీసులు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. కోర్టును ఆశ్ర‌యించాల‌ని టీడీపీ నేత‌లు నిర్ణ‌యించారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 28, 2023 10:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

17 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

25 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago