టీడీపీ నాయకులు ఏ కార్యక్రమం చేస్తున్నా.. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కీలక నేతలను, మాజీ మంత్రులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు.. కార్యకర్తలను, నాయకుల అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజల్లో సింపతీ వచ్చే ఏ కార్యక్రమాన్ని కూడా వారు వదిలి పెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా యువగళం పాదయాత్రపైనా పోలీసులు విరుచుకుపడేలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్స్టేషన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. కుప్పంలో నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ ఫిర్యాదు చేశారని, దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, యువగళం పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న కార్యకర్తలను కూడా అడ్డుకునేందుకు పోలీసులు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారని.. పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో సంఘ విద్రోహ శక్తులు పాల్గొనే అవకాశం ఉందని.. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు వ్యాఖ్యానించడం.. టీడీపీని కలవరపెడుతోంది. సంఘ విద్రోహులు అంటే ఎవరంటూ.. పోలీసులను నాయకులు ప్రశ్నించారు.
ఇదిలావుంటే.. తాము ఇచ్చిన అనుమతులను యువగళం నేతలు ఎవరూ కూడా పాటించడం లేదని.. పోలీసులు వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో ప్రజలను తీసుకువస్తున్నారని.. ఇంత మందిని అనుమతించేందుకు నిబంధనలు అంగీకరించవని కూడా పోలీసులు హెచ్చరించారు. అంటే.. దీనిని బట్టి యువగళంపై పోలీసులు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…