టీడీపీ నాయకులు ఏ కార్యక్రమం చేస్తున్నా.. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కీలక నేతలను, మాజీ మంత్రులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు.. కార్యకర్తలను, నాయకుల అనుచరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజల్లో సింపతీ వచ్చే ఏ కార్యక్రమాన్ని కూడా వారు వదిలి పెట్టడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా యువగళం పాదయాత్రపైనా పోలీసులు విరుచుకుపడేలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్స్టేషన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసు నమోదైంది. కుప్పంలో నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం ఎస్ఐ శివకుమార్ ఫిర్యాదు చేశారని, దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, యువగళం పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న కార్యకర్తలను కూడా అడ్డుకునేందుకు పోలీసులు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారని.. పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో సంఘ విద్రోహ శక్తులు పాల్గొనే అవకాశం ఉందని.. తాజాగా చిత్తూరు జిల్లా పోలీసులు వ్యాఖ్యానించడం.. టీడీపీని కలవరపెడుతోంది. సంఘ విద్రోహులు అంటే ఎవరంటూ.. పోలీసులను నాయకులు ప్రశ్నించారు.
ఇదిలావుంటే.. తాము ఇచ్చిన అనుమతులను యువగళం నేతలు ఎవరూ కూడా పాటించడం లేదని.. పోలీసులు వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో ప్రజలను తీసుకువస్తున్నారని.. ఇంత మందిని అనుమతించేందుకు నిబంధనలు అంగీకరించవని కూడా పోలీసులు హెచ్చరించారు. అంటే.. దీనిని బట్టి యువగళంపై పోలీసులు కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 28, 2023 10:09 pm
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…