జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు సంధించారు. “నేను తీవ్రవాదిగా మారితే తట్టుకోలేరు” అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలుచేయాలని తలపోస్తున్నారని.. ఇదే కనుక జరిగితే.. తాను తీవ్రవాదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అప్పుడు వైసీపీ నేతలు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతమో కాదని గుర్తుంచుకో వాలని పవన్ అన్నారు. “నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు” అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు.
“విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా?” అని పవన్ ప్రశ్నించారు. “మేం దేశ భక్తులం.. ఏపీని ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం” అని నిప్పులు చెరిగారు.
మీ స్వార్థం కోసం స్టేట్మెంట్లు ఇవ్వొద్దని వైసీపీ నాయకులకు పవన్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారని.. ఆ సంగతి మీకు తెలుసా? అని వైసీపీ నాయకులను పవన్ నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దన్నారు. మొత్తానికి పవన్ హాట్ కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on January 27, 2023 6:15 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…