జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు సంధించారు. “నేను తీవ్రవాదిగా మారితే తట్టుకోలేరు” అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలుచేయాలని తలపోస్తున్నారని.. ఇదే కనుక జరిగితే.. తాను తీవ్రవాదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అప్పుడు వైసీపీ నేతలు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతమో కాదని గుర్తుంచుకో వాలని పవన్ అన్నారు. “నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు” అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు.
“విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా?” అని పవన్ ప్రశ్నించారు. “మేం దేశ భక్తులం.. ఏపీని ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం” అని నిప్పులు చెరిగారు.
మీ స్వార్థం కోసం స్టేట్మెంట్లు ఇవ్వొద్దని వైసీపీ నాయకులకు పవన్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారని.. ఆ సంగతి మీకు తెలుసా? అని వైసీపీ నాయకులను పవన్ నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దన్నారు. మొత్తానికి పవన్ హాట్ కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…