జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు సంధించారు. “నేను తీవ్రవాదిగా మారితే తట్టుకోలేరు” అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలుచేయాలని తలపోస్తున్నారని.. ఇదే కనుక జరిగితే.. తాను తీవ్రవాదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అప్పుడు వైసీపీ నేతలు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతమో కాదని గుర్తుంచుకో వాలని పవన్ అన్నారు. “నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు” అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు.
“విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా?” అని పవన్ ప్రశ్నించారు. “మేం దేశ భక్తులం.. ఏపీని ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం” అని నిప్పులు చెరిగారు.
మీ స్వార్థం కోసం స్టేట్మెంట్లు ఇవ్వొద్దని వైసీపీ నాయకులకు పవన్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారని.. ఆ సంగతి మీకు తెలుసా? అని వైసీపీ నాయకులను పవన్ నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దన్నారు. మొత్తానికి పవన్ హాట్ కామెంట్లు దుమ్ము రేపుతున్నాయి. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on January 27, 2023 6:15 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…