నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మాట్లాడిన బాలయ్య…అక్కినేని నాగేశ్వరరావు ఎస్వీ రంగారావులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్లు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
దీంతో, బాలకృష్ణపై అఖిల్, నాగ చైతన్యలు కూడా విమర్శలు చేశారు. అయితే, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై బాలకృష్ణ తొలిసారి మీడియా ముఖంగా స్పందించారు. తాను ఫ్లోలో అన్న మాటలకు రాద్ధాంతం చేస్తున్నారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావును తన బాబాయ్ గా భావిస్తానని అన్నారు.
తన పిల్లలకంటే నన్నే అక్కినేని ప్రేమగా చూసుకునేవారని, బాబాయి పట్ల నా గుండెల్లో ప్రేమ ఉందని అన్నారు. బయట ఎవరో ఏదో అంటుంటారని, అవన్నీ తాను పట్టించుకోనని చెప్పారు. అభిమానంతో ఎన్టీవోడని, నాగిగాడు అని పిలుస్తారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిపోతున్నాడ్రా అంటూ ఏదో ఒకటి అంటుంటారని, అభిమానంతోనే వారు అలా పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు.
అభిమానం ఉన్న వ్యక్తుల గురించి అలా మాట్లాడతామని, వాటిని తప్పబడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రేమ కొద్దీ అన్న మాటలను పట్టుకొని దుష్ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాడో పేడో అంటుంటామని, పేడో అంటే అర్థం ఏమిటని బాలయ్య ప్రశ్నించారు. మరి, ఈ వివరణ తర్వాత అయినా అక్కినేని కుటుంబ సభ్యులు, అక్కినేని అభిమానులు సైలెంట్ అవుతారా లేక బాలయ్య క్షమాపణలు చెప్పేదాకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on January 26, 2023 6:07 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…