ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అని కొందరు.. కాదు.. ప్రజా కంటకమని మరికొంద రు చెబుతున్నారు. ఇక, వీటిపై కోర్టులకు ఎక్కిన వాటిని గమనిస్తే.. అక్కడ తీర్పులను పరిశీలిస్తే.. పంటి కింద రాళ్లు తగులుతున్నాయి. మరి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా సీఎం జగన్కు ఇబ్బందిని తీసుకువస్తున్నాయి.
నిజానికి ఆది నుంచి కూడా కొన్ని దూకుడు నిర్ణయాల కారణంగా సీఎం జగన్ అభాసుపాలయ్యారు. ప్రజా వేదికను కూల్చడం మంచిదని ఆయన చెప్పారు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా చేసిన ఈ నిర్మాణం సరికాదన్నారు. అయితే.. తదనంతరం.. ఇలా చేసిన నిర్మాణాల్లో ఒక్క దాన్ని కూడా ఆయన కూల్చలేక పోయారు. ఇక, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది.
మరీ ముఖ్యంగా అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను హఠాత్తుగా ట్రాన్స్ఫర్ చేయడం.. మరో వివాదం. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘంతో వివాదం పెట్టుకుని రచ్చకెక్కారు. ఇవన్నీతొలి దశ పరిణామాల్లో సీఎం జగన్కు మాయని మచ్చలుగా మారిపోయాయి. ఇక, ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజల రక్షణ.. అదే పర్యావరణ హితం ఉన్నప్పటికీ.. ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా తీసుకున్న నిర్ణయాలు కావడంతో అవికూడా అభాసుపాలయ్యాయి.
ఒకటి ఫ్లెక్సీలపై నిషేధం. దీనిని చాలా ఆర్భాటంగా అప్పటికప్పుడు. ఒక కలెక్టర్ చెప్పారన్న కారణంగా సీఎం జగన్ ఓ సభలో ప్రకటించారు. కానీ నేడు డిజిటల్ యుగంలో అన్నీ ఫ్లెక్సీలపైనే ప్రచారం జరుగు తోంది. దీనిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాటు జీవిస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వివాదమైంది.
ఇక, జీవో 1 ద్వారా.. కందుకూరు, గుంటూరు వంటి ఘటన లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని చెబుతున్నా.. ఇది కూడా న్యాయం ముందు నిలవడం లేదనే టాక్ వినిపిస్తోంది.ఇలాంటి వాటివల్ల సీఎం జగన్ ఎన్ని చేసినా.. ఆయనకు అనుభవం లేదనే వాదన బలపడుతుండడం ఇటు పార్టీకి.. అటు వ్యక్తిగతంగా ఆయనకు కూడా మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.
This post was last modified on January 26, 2023 2:23 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…