Political News

గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుకు క‌రోనా

చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అంద‌రినీ అంటుకుంటూ పోతోంది క‌రోనా. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. క‌రోనా మిన‌హాయింపులేమీ ఇవ్వ‌ట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెల‌బ్రెటీలు.. ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని క‌రోనా ప‌ల‌క‌రించింది. తాజాగా ఏపీలో ఓ క‌లెక్ట‌రు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుగా కోవిడ్ నియంత్ర‌ణ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఆయ‌న‌కు కూడా వైర‌స్ సోకింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డం, ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా ఏమీ లేక‌పోవ‌డంతో క‌లెక్ట‌రు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

క‌రోనా నియంత్ర‌ణ‌లో చాలా కీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారే క‌రోనా బారిన ప‌డ‌టం జిల్లాలో వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బందికి క‌రోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్ప‌టిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వ‌దిలారు. మంగ‌ళ‌వారం కూడా అయిదుగురు క‌రోనాతో మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప‌ది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.

This post was last modified on July 22, 2020 12:41 am

Share
Show comments
Published by
suman

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago