చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అందరినీ అంటుకుంటూ పోతోంది కరోనా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. కరోనా మినహాయింపులేమీ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెలబ్రెటీలు.. ఇలా చాలామంది ప్రముఖుల్ని కరోనా పలకరించింది. తాజాగా ఏపీలో ఓ కలెక్టరు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయన పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా కలెక్టరుగా కోవిడ్ నియంత్రణ కోసం కష్టపడుతున్న ఆయనకు కూడా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడం, లక్షణాలు మరీ తీవ్రంగా ఏమీ లేకపోవడంతో కలెక్టరు హోం క్వారంటైన్కు వెళ్లారు. కలెక్టర్ ఛాంబర్ను తాత్కాలికంగా మూసివేశారు.
కరోనా నియంత్రణలో చాలా కీలంగా వ్యవహరిస్తున్న అధికారే కరోనా బారిన పడటం జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం కూడా అయిదుగురు కరోనాతో మరణించడం గమనార్హం. గత పది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.
This post was last modified on July 22, 2020 12:41 am
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…