చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అందరినీ అంటుకుంటూ పోతోంది కరోనా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. కరోనా మినహాయింపులేమీ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెలబ్రెటీలు.. ఇలా చాలామంది ప్రముఖుల్ని కరోనా పలకరించింది. తాజాగా ఏపీలో ఓ కలెక్టరు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయన పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా కలెక్టరుగా కోవిడ్ నియంత్రణ కోసం కష్టపడుతున్న ఆయనకు కూడా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడం, లక్షణాలు మరీ తీవ్రంగా ఏమీ లేకపోవడంతో కలెక్టరు హోం క్వారంటైన్కు వెళ్లారు. కలెక్టర్ ఛాంబర్ను తాత్కాలికంగా మూసివేశారు.
కరోనా నియంత్రణలో చాలా కీలంగా వ్యవహరిస్తున్న అధికారే కరోనా బారిన పడటం జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కరోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడగా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్పటిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వదిలారు. మంగళవారం కూడా అయిదుగురు కరోనాతో మరణించడం గమనార్హం. గత పది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.
This post was last modified on July 22, 2020 12:41 am
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…