Political News

గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుకు క‌రోనా

చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అంద‌రినీ అంటుకుంటూ పోతోంది క‌రోనా. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. క‌రోనా మిన‌హాయింపులేమీ ఇవ్వ‌ట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెల‌బ్రెటీలు.. ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని క‌రోనా ప‌ల‌క‌రించింది. తాజాగా ఏపీలో ఓ క‌లెక్ట‌రు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుగా కోవిడ్ నియంత్ర‌ణ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఆయ‌న‌కు కూడా వైర‌స్ సోకింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డం, ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా ఏమీ లేక‌పోవ‌డంతో క‌లెక్ట‌రు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

క‌రోనా నియంత్ర‌ణ‌లో చాలా కీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారే క‌రోనా బారిన ప‌డ‌టం జిల్లాలో వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బందికి క‌రోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్ప‌టిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వ‌దిలారు. మంగ‌ళ‌వారం కూడా అయిదుగురు క‌రోనాతో మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప‌ది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.

This post was last modified on July 22, 2020 12:41 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

1 hour ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

2 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

3 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

3 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

5 hours ago

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

14 hours ago