Political News

గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుకు క‌రోనా

చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అంద‌రినీ అంటుకుంటూ పోతోంది క‌రోనా. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. క‌రోనా మిన‌హాయింపులేమీ ఇవ్వ‌ట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెల‌బ్రెటీలు.. ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని క‌రోనా ప‌ల‌క‌రించింది. తాజాగా ఏపీలో ఓ క‌లెక్ట‌రు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుగా కోవిడ్ నియంత్ర‌ణ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఆయ‌న‌కు కూడా వైర‌స్ సోకింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ రావ‌డం, ల‌క్ష‌ణాలు మ‌రీ తీవ్రంగా ఏమీ లేక‌పోవ‌డంతో క‌లెక్ట‌రు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

క‌రోనా నియంత్ర‌ణ‌లో చాలా కీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అధికారే క‌రోనా బారిన ప‌డ‌టం జిల్లాలో వైర‌స్ తీవ్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. జిల్లాలో ఇంకా చాలామంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బందికి క‌రోనా సోకింది. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏపీడీలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే జిల్లా వైద్య శాఖ అధికారి, పలువురు జిల్లా అధికారులకు , ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో వాళ్లు కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం గుంటూరు జిల్లాలో 577 కొత్త కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం కేసుల సంఖ్య 6 వేలు దాటిపోయింది. ఇప్ప‌టిదాకా జిల్లాలో కోవిడ్ కారణంగా 63 మంది ప్రాణాలు వ‌దిలారు. మంగ‌ళ‌వారం కూడా అయిదుగురు క‌రోనాతో మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. గ‌త ప‌ది రోజుల్లోనే జిల్లాలో 4 వేల దాకా కేసులు వెలుగుచూశాయి.

This post was last modified on July 22, 2020 12:41 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago