Political News

కాళ్లు బావుంటే నేనే పోటీ

రాయపాటి సాంబశివరావు… ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కాంగ్రెస్, టీడీపీలో ఆయన హవా కొనసాగింది. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరే ఉంది. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారన్న ట్రాక్ రికార్డు ఉంది. ఓడిపోతూ, గెలుస్తూ రాజకీయాలు చేసే గుంటూరు, నరసరావుపేట మాజీ ఎంపీ గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇంకేముందు వయోభారంతో రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. రెండు సంవత్సరాలు మౌనంగా ఉండటంతో సీన్లో లేనట్లే అనుకున్నారు. అంతలోనే రాయపాటి మళ్లీ బయటకు వచ్చారు. ఏకంగా ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు…

వీల్ ఛైర్ పాలిటిక్స్

రాయపాటికి బాగా వయసైపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన వీల్ ఛైర్లో తిరుగుతున్నారు. రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీయార్ వర్థంతి కార్యక్రమాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. రెండు మూడు ఫంక్షన్లకు ఆయన వీల్ ఛైర్లోనే వచ్చారు. తాడికొండ ఫంక్షన్లో మీడియాతో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి రాజవర్థన్ పోటీ చేస్తారని, గెలిచి మంత్రి అవుతారని కూడా రాయపాటి చెప్పేశారు. దానితో మీడియా వారు, అక్కడున్న టీడీపీ అభిమానులు ఖంగుతిన్నారు. నిజానికి జిల్లా పార్టీ అధ్యక్షుడైన, తాడికొండ ఇంఛార్జ్ శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి గుర్తు చేస్తే నేను చెబుతున్నా కదా అంటూ ఎదురు దాడికి ఆయన ప్రయత్నించారు..

కాళ్లు బావుంటే నేనే పోటీ

రాయపాటి మరో స్కడ్ వదిలారు. ఎన్నికల్లోపు కాళ్లు బాగుపడితే తానే పోటీ చేస్తానని నేరుగా చంద్రబాబుకే ఆఫరిచ్చేశారు. లేని పక్షంలో తన కుమారుడికి టికెటివ్వాలని డిమాండ్ పెట్టారు ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒక్క టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ పెట్టారు..

ఒక ఫ్యామిలీ రెండు టికెట్లు

రాయపాటి ఇప్పుడు తన కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్నారు. తన కొడుకు, కూతురు ఇద్దరికీ టికెట్లు కావాలని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. పార్టీ అధినేత ఆయనకు గట్టిగా క్లాస్ తీసుకుని ఒక టికెట్ చూద్దాంలే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. దానితో రాయపాటి లోకల్, నాన్ లోకల్ చర్చ తెచ్చారు. నరసరావు పేట ఎంపీ టికెట్ కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు డిసైడైనట్లు రాయపాటి గుర్తించారు పైగా పుట్టా సుధాకర్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు. దానితో ఇప్పుడు కడప వారికి టికెటిస్తే ఓడిస్తామని రాయపాటి హెచ్చరిస్తున్నారు. పైగా తాను ఇండిపెండెంట్ గా దిగుతానని కూడా ఆయన ప్రకటించారు…కడప వారికి పల్నాడులో ఏం పని అని రాయపాటి ప్రశ్నిస్తున్నారు…

బీసీ సంఘాల ఆగ్రహం

రాయపాటి తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. పుట్టా మహేష్, బీసీ సామాజిక వర్గం వ్యక్తి కావడంతో రాయపాటి నాన్ లోకల్ ఫీలింగ్ తెచ్చారని వారి ఆరోపణ. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ కు గుంటూరు టికెట్ ఇచ్చినప్పుడు రాయపాటి మాట్లాడలేదని వారు గుర్తు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు నాన్ లోకల్ ఉండదా, బీసీలకే ఉంటుందా అని బీసీ సంఘాల ప్రశ్న. మరి దీనికి రాయపాటి సమాధానం ఏమిటో చూడాలి…

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

4 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

7 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

9 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

10 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

11 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

11 hours ago