Political News

కాళ్లు బావుంటే నేనే పోటీ

రాయపాటి సాంబశివరావు… ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కాంగ్రెస్, టీడీపీలో ఆయన హవా కొనసాగింది. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరే ఉంది. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారన్న ట్రాక్ రికార్డు ఉంది. ఓడిపోతూ, గెలుస్తూ రాజకీయాలు చేసే గుంటూరు, నరసరావుపేట మాజీ ఎంపీ గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇంకేముందు వయోభారంతో రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. రెండు సంవత్సరాలు మౌనంగా ఉండటంతో సీన్లో లేనట్లే అనుకున్నారు. అంతలోనే రాయపాటి మళ్లీ బయటకు వచ్చారు. ఏకంగా ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు…

వీల్ ఛైర్ పాలిటిక్స్

రాయపాటికి బాగా వయసైపోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడాయన వీల్ ఛైర్లో తిరుగుతున్నారు. రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీయార్ వర్థంతి కార్యక్రమాన్ని ఆయన ఉపయోగించుకున్నారు. రెండు మూడు ఫంక్షన్లకు ఆయన వీల్ ఛైర్లోనే వచ్చారు. తాడికొండ ఫంక్షన్లో మీడియాతో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి రాజవర్థన్ పోటీ చేస్తారని, గెలిచి మంత్రి అవుతారని కూడా రాయపాటి చెప్పేశారు. దానితో మీడియా వారు, అక్కడున్న టీడీపీ అభిమానులు ఖంగుతిన్నారు. నిజానికి జిల్లా పార్టీ అధ్యక్షుడైన, తాడికొండ ఇంఛార్జ్ శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి గుర్తు చేస్తే నేను చెబుతున్నా కదా అంటూ ఎదురు దాడికి ఆయన ప్రయత్నించారు..

కాళ్లు బావుంటే నేనే పోటీ

రాయపాటి మరో స్కడ్ వదిలారు. ఎన్నికల్లోపు కాళ్లు బాగుపడితే తానే పోటీ చేస్తానని నేరుగా చంద్రబాబుకే ఆఫరిచ్చేశారు. లేని పక్షంలో తన కుమారుడికి టికెటివ్వాలని డిమాండ్ పెట్టారు ఎంపీ, ఎమ్మెల్యే ఏదో ఒక్క టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ పెట్టారు..

ఒక ఫ్యామిలీ రెండు టికెట్లు

రాయపాటి ఇప్పుడు తన కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్నారు. తన కొడుకు, కూతురు ఇద్దరికీ టికెట్లు కావాలని చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. పార్టీ అధినేత ఆయనకు గట్టిగా క్లాస్ తీసుకుని ఒక టికెట్ చూద్దాంలే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. దానితో రాయపాటి లోకల్, నాన్ లోకల్ చర్చ తెచ్చారు. నరసరావు పేట ఎంపీ టికెట్ కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు డిసైడైనట్లు రాయపాటి గుర్తించారు పైగా పుట్టా సుధాకర్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు. దానితో ఇప్పుడు కడప వారికి టికెటిస్తే ఓడిస్తామని రాయపాటి హెచ్చరిస్తున్నారు. పైగా తాను ఇండిపెండెంట్ గా దిగుతానని కూడా ఆయన ప్రకటించారు…కడప వారికి పల్నాడులో ఏం పని అని రాయపాటి ప్రశ్నిస్తున్నారు…

బీసీ సంఘాల ఆగ్రహం

రాయపాటి తీరుపై బీసీ సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. పుట్టా మహేష్, బీసీ సామాజిక వర్గం వ్యక్తి కావడంతో రాయపాటి నాన్ లోకల్ ఫీలింగ్ తెచ్చారని వారి ఆరోపణ. చిత్తూరు జిల్లాకు చెందిన గల్లా జయదేవ్ కు గుంటూరు టికెట్ ఇచ్చినప్పుడు రాయపాటి మాట్లాడలేదని వారు గుర్తు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు నాన్ లోకల్ ఉండదా, బీసీలకే ఉంటుందా అని బీసీ సంఘాల ప్రశ్న. మరి దీనికి రాయపాటి సమాధానం ఏమిటో చూడాలి…

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago