Political News

జ‌గ‌న్ అస‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి.. ఎవ‌ర‌న్నారో తెలుసా?

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న పార్టీ ప‌రివారం, అనుకూల మీడియా సైతం ఆయ‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న ప‌రిస్థితిని చూస్తూనే ఉన్నాం. అంతేకాదు.. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు కూడా పుణికి పుచ్చుకుంటున్నాయ‌ని, ఆద‌ర్శ‌వంత‌మైన రాష్ట్రం అంటూ..ఏపీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నాయ ని.. పెద్ద ఎత్తున భ‌జ‌న‌చేస్తున్న‌విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ భ‌జ‌న‌కు..పొగ‌డ్త‌ల‌కు భిన్నంగా కేంద్ర మంత్రి ఒక‌రు స్పందించారు.

ఏపీలో అస‌మర్థ పాల‌న సాగుతోంద‌ని కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల అంచుల్లో ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయార‌ని చెప్పారు. సుప‌రిపాల‌నను(గుడ్ గవర్నెన్స్) అందించ‌డంలో సీఎం జగన్ విఫలమయ్యారని నిప్పులు చెరిగారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదన్నారు.

రాష్ట్రంలోని గ్రామ‌ సర్పంచులు కేంద్రానికి వ‌చ్చి వినతిపత్రాలు ఇచ్చే ప‌రిస్థితి క‌ల్పించార‌ని దేవుసిన్హ్ చెప్పారు. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం 14,15 ప్రణాళిక సంఘం నిధులు ఇచ్చింద‌ని, అయితే.. వీటిని దొడ్డి దారిలో ప్రభుత్వం వాడుకుందని చుర‌క‌లు అంటించారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. “పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు” అని తెలిపారు.

వలంటీలర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారని విమ‌ర్శించారు. వలంటీర్లను కేవలం ఇతర పార్టీలను అణచి వేసేందుకు వాడుతున్నారనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్న కేంద్ర మంత్రి… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదన్నారు. 20 లక్షల గృహాలను కేంద్రం ఏపీకి మంజూరు చేసిందన్నారు. ఇక్కడ చూస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on January 24, 2023 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago