వైసీపీ ఎంపీ, యువ నాయకుడు, సీఎం జగన్కు తమ్ముడు వరుస అయ్యే.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పటికే ఆయనకు నోటీసులు స్వయంగా అందించింది. విచారణకు రావాలని .. కోరింది. అయితే, ఆయన మాత్రం ఐదు రోజుల పాటు గడువు కోరారు. ఇది.. ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే.. విదేశాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారని సీబీఐకి ఉప్పందడంతో అలెర్టయింది.
ఐదు రోజులు కాదు.. ఐదు గంటలు కూడా సమయం ఇచ్చేది లేదంటూ.. సీబీఐ అధికారులు వెంటనే కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంట్ తీసుకున్నారని తెలిసింది. దీనిని తీసుకుని హుటాహుటిన కడపకు చేరు కున్నట్టు సమాచారం. స్థానిక పోలీసుల సహకారంతో ఎంపీ అవినాష్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చి విచారించనున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మంగళవారం హైదరాబాద్కు వచ్చి తమకు సహకరించాలని సీబీఐ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనికి ప్రతిగా తాను ఎంపీ హోదాలో ఉన్నందున.. వచ్చేందుకు కుదరదని.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకున్నానని.. ఎంపీ అవినాష్ చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై సీబీఐ స్పందించే లోగానే.. అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలాని ప్రయత్నిస్తున్నట్టు సీబీఐవర్గాలకు అనుమానం వ్యక్తమైంది.
దీంతోహుటాహుటిన సీబీఐ బృందాలు కడపకు చేరుకున్నాయి. స్థానిక పోలీసులను తీసుకుని అరెస్టు వారంత్తో సహా కడపలో జల్లెడపడుతున్నట్టు తెలుస్తోంది. ఏక్షణమైనా అవినాష్ను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ అరెస్టు చేయకపోతే.. వెంటనే ఆయన నుంచి పాస్ పోర్టు ను సీజ్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on January 24, 2023 2:35 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…