వైసీపీ ఎంపీ, యువ నాయకుడు, సీఎం జగన్కు తమ్ముడు వరుస అయ్యే.. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పటికే ఆయనకు నోటీసులు స్వయంగా అందించింది. విచారణకు రావాలని .. కోరింది. అయితే, ఆయన మాత్రం ఐదు రోజుల పాటు గడువు కోరారు. ఇది.. ఇప్పటి వరకు తెలిసిన విషయం. అయితే.. విదేశాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారని సీబీఐకి ఉప్పందడంతో అలెర్టయింది.
ఐదు రోజులు కాదు.. ఐదు గంటలు కూడా సమయం ఇచ్చేది లేదంటూ.. సీబీఐ అధికారులు వెంటనే కోర్టును ఆశ్రయించి అరెస్టు వారెంట్ తీసుకున్నారని తెలిసింది. దీనిని తీసుకుని హుటాహుటిన కడపకు చేరు కున్నట్టు సమాచారం. స్థానిక పోలీసుల సహకారంతో ఎంపీ అవినాష్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చి విచారించనున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మంగళవారం హైదరాబాద్కు వచ్చి తమకు సహకరించాలని సీబీఐ ఆయనకు నోటీసులు ఇచ్చింది. దీనికి ప్రతిగా తాను ఎంపీ హోదాలో ఉన్నందున.. వచ్చేందుకు కుదరదని.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకున్నానని.. ఎంపీ అవినాష్ చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై సీబీఐ స్పందించే లోగానే.. అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోవాలాని ప్రయత్నిస్తున్నట్టు సీబీఐవర్గాలకు అనుమానం వ్యక్తమైంది.
దీంతోహుటాహుటిన సీబీఐ బృందాలు కడపకు చేరుకున్నాయి. స్థానిక పోలీసులను తీసుకుని అరెస్టు వారంత్తో సహా కడపలో జల్లెడపడుతున్నట్టు తెలుస్తోంది. ఏక్షణమైనా అవినాష్ను అరెస్టు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగినట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ అరెస్టు చేయకపోతే.. వెంటనే ఆయన నుంచి పాస్ పోర్టు ను సీజ్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
This post was last modified on January 24, 2023 2:35 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…