Political News

బీజేపీ, సీపీఐపై పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు

ఏపీలో బీజేపీకి కేంద్ర నాయకత్వం అండ ఉంది. మోదీ, అమిత్ షా నిత్యం రాష్ట్ర నేతలతో టచ్ లో ఉంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని నూరు పోస్తుంటారు. జనసేన, బీజేపీతో పొత్తు వ్యవహారం ఇంకా కొలిక్కి రానప్పటికీ సొంత బలాన్ని కొంతైనా పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మరి గెలుస్తారా… అంత సీన్ ఉందా అంటే మాత్రం రాష్ట్ర బీజేపీ అధినాయక్వంలో ఆ విశ్వాసం లేదని తేలిపోయింది..

సోము వీర్రాజు చెప్పేశారు..

సర్పంచులకు నిధులు, విధులపై విజయవాడలో ఒక సదస్సు జరిగింది. క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు నిధుల కొరత ఏర్పడుతోందని, కొత్త నిధులు ఇవ్వకపోగా, ఉన్న నిధులను జగన్ ప్రభుత్వం లాగేస్తోందని సర్పంచులు వాపోయారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా హాజరయ్యారు. వీర్రాజు తనదైన శైలిలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. సర్పంచుల్లో అత్యధిక శాతం మంది వైసీపీ వారేనని, వచ్చే ఎన్నికల్లో వారు ఏ పార్టీకి మద్దతిస్తారో కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. పైగా పక్కనున్న సీపీఐ రామకృష్ణ వైపుకు తిరిగి… మా తమ్ముడు ఎప్పుడు మోదీ గారిని తిడుతుంటారు.. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడు, మేము గెలవము, ఆయనకు ఓటెయ్యరు, మాకు ఓటెయ్యరు.. అని భారీ డైలాగ్ వదిలారు..దానితో రామకృష్ణ నవ్వుతూ ఉండిపోయారు..

నిజమే కదా అంటూ సెటైర్లు

వీర్రాజు వ్యాఖ్యానం కొద్ది గంటల్లోనే ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతలు జోకులేయడం మొదలుపెట్టారు వీర్రాజు జోకుగా చెప్పినా నిజమే చెప్పారని వారన్నారు. విజయం సాధించలేమన్న సంగతి ఒప్పుకోవడం మామూలు విషయం కాదని, వీర్రాజులాంటి పెద్ద మనసు ఉన్నవారికే అది సాధ్యమని సెటైర్లు మొదలయ్యాయి. పైగా ఒక్క సీటు కూడా గెలవలేని సీపీఐ నేత రామకృష్ణ.. రోజుకు మూడు సార్లు మీడియా ముందుకు వస్తారని కూడా జోకులేస్తున్నారు. ఏదేమైనా వీర్రాజు మాట ఇప్పుడు కామెడీగానైనా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యిందని చెప్పక తప్పదు..

This post was last modified on January 24, 2023 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

51 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago