Political News

విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మ‌రోమారు ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌తో వార్తల్లోకి ఎక్కారు. గ‌త కొద్దిరోజులుగా వైసీపీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆయ‌న్ను దూరం పెడుతున్నార‌నే ప్ర‌చారంతో మీడియా దృష్టిని ఆక‌ర్షించిన విజ‌యసాయిరెడ్డి తాజాగా క‌రోనా పాజిటివ్ అనే ప్ర‌చారంతో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు.

విజ‌య‌సాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేశాయి. దివంగ‌త సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నార‌ని పేర్కొంటూ అదే కార్యక్రమంలో పాల్గొన్న స‌మ‌యంలో కరోనా సోకింద‌ని ఆయా వార్తా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. అయితే, దీనికి విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

క‌రోనా పాజిటివ్ వార్త‌ల నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి పరోక్షంగా త‌న స్పంద‌న తెలియ‌జేశారు. కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో స్వ‌తహాగా నేనే నిర్ణ‌యం తీసుకొని వారం నుంచి ప‌దిరోజుల పాటు క్వారంటైన్లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ స‌మ‌యంలో కేవ‌లం అత్య‌వ‌స‌ర‌మైన సంద‌ర్భంలో మాత్ర‌మే టెలిఫోన్‌లో అందుబాటులో ఉంటాను అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, త‌న‌కు క‌రోన అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని విజ‌యసాయిరెడ్డి తిప్పికొట్ట‌లేదు. అలా అని అంగీక‌రించ‌లేదు.

ఇదిలాఉండ‌గా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 4944 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం నమోదైన కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇందులో 32,336 కేసులు యాక్టివ్ కాగా 25,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మ‌రోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో 62 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య758కి చేరింది.

This post was last modified on July 21, 2020 11:02 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

4 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

7 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago