Political News

టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఇదే…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో స‌ర్వేలు కామ‌న్‌. ఏ పార్టీకి ఆ పార్టీ స‌ర్వేలు చేయించుకుం టాయి. దీనిని ప్ర‌చారం చేసుకునేందుకు లేదా.. పార్టీ నేత‌ల్లో భ‌రోసాను నింపేందుకు పార్టీలు వినియోగిం చుకుంటాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అలానే ఇప్పుడు అంత‌ర్గ‌త స‌ర్వేలు పుంజుకున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయిస్తున్నాయి.

తాజాగా టీడీపీకి అత్యంత కీల‌క నాయ‌కుడిగా పేరున్న ఎన్నారై.. ఆధ్వ‌ర్యంలో డిజిట‌ల్ సర్వే ఒకటి అంత ర్గ‌తంగా చేయించిన‌ట్టు తెలిసింది. ఈ స‌ర్వేలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? పార్టీపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నా రు? వైసీపీకి గెలిచే ఛాన్స్ ఎంత‌? ఏ ప్రాంతంలో ప‌రిస్థితి టీడీపీకి ఎలా ఉంది? వంటి అంశాల‌ను కూలం క‌షంగా చ‌ర్చించార‌ని తెలిసింది. దీని ప్ర‌కారం.. తాజాగా టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు వున్నాయ‌ని అంటున్నారు.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ జోష్ పెరిగింద‌ని ఈ డిజిట‌ల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక్క‌డి మెజారిటీ స్థానాల్లోనే కాకుండా.. గ‌తంలో 2014లో వ‌చ్చిన ఊపు వ‌స్తుంద‌ని తేల్చింది. కూన ర‌వికుమార్ గెలుపు గుర్రం ఎక్కుతార‌ని తేల్చింది. అదేవిధంగా ఇద్ద‌రు మంత్రుల‌ను ఇంటికి పంపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది. ఇక‌, ఉభ‌య గోదావ‌రి.. కోస్తా జిల్లాల్లోనూ పార్టీకి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెబుతున్నారు.

అయితే, విశాఖ‌పై మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. వైసీపీ ప్ర‌క‌టించిన రాజ‌ధాని విషయంపై ప్ర‌జ‌లు గుంభ‌నంగా ఉన్నార‌ని.. కొంద‌రు వ‌ద్ద‌ని అంటున్నా .. మెజారిటీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని.. ఆ ర‌కంగా అయినా త‌మ ప్రాంతం మ‌రింత డెవ‌ల‌ప్ అవుతుంద‌ని చెబుతున్నార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కోస్తాలోనూ అటు ఇటుగా టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు ఉన్నాయ‌ని డిజిట‌ల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

అయితే, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరుజిల్లాల్లో మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని.. సీమ‌లో మాత్రం టీడీపీ ఎదురీత త‌ప్ప‌ద‌ని ఈ స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, చంద్ర‌బాబు గెలుపు సాధ్య‌మేన‌ని చెప్పిన స‌ర్వే.. నారా లోకేష్‌కు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కేటాయింపులు త‌ప్ప‌ద‌ని తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ స‌ర్వేపై అనేక భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకంటే.. ఇది ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన చిన్న‌పాటి స‌ర్వే కావ‌డం.. కేవ‌లం ఒక్కొక్క ప్రాంతం నుంచి వెయ్యి .. రెండు వేల లోపు వారినే ప్ర‌శ్నించ‌డంతో మ‌రింత విస్తృతంగా స‌ర్వే చేయించాల‌ని పార్టీ అధినేత నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

This post was last modified on January 24, 2023 6:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

24 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

37 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago