Political News

టీడీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఇదే…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో స‌ర్వేలు కామ‌న్‌. ఏ పార్టీకి ఆ పార్టీ స‌ర్వేలు చేయించుకుం టాయి. దీనిని ప్ర‌చారం చేసుకునేందుకు లేదా.. పార్టీ నేత‌ల్లో భ‌రోసాను నింపేందుకు పార్టీలు వినియోగిం చుకుంటాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. అలానే ఇప్పుడు అంత‌ర్గ‌త స‌ర్వేలు పుంజుకున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు టీడీపీ కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయిస్తున్నాయి.

తాజాగా టీడీపీకి అత్యంత కీల‌క నాయ‌కుడిగా పేరున్న ఎన్నారై.. ఆధ్వ‌ర్యంలో డిజిట‌ల్ సర్వే ఒకటి అంత ర్గ‌తంగా చేయించిన‌ట్టు తెలిసింది. ఈ స‌ర్వేలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? పార్టీపై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నా రు? వైసీపీకి గెలిచే ఛాన్స్ ఎంత‌? ఏ ప్రాంతంలో ప‌రిస్థితి టీడీపీకి ఎలా ఉంది? వంటి అంశాల‌ను కూలం క‌షంగా చ‌ర్చించార‌ని తెలిసింది. దీని ప్ర‌కారం.. తాజాగా టీడీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు వున్నాయ‌ని అంటున్నారు.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ జోష్ పెరిగింద‌ని ఈ డిజిట‌ల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక్క‌డి మెజారిటీ స్థానాల్లోనే కాకుండా.. గ‌తంలో 2014లో వ‌చ్చిన ఊపు వ‌స్తుంద‌ని తేల్చింది. కూన ర‌వికుమార్ గెలుపు గుర్రం ఎక్కుతార‌ని తేల్చింది. అదేవిధంగా ఇద్ద‌రు మంత్రుల‌ను ఇంటికి పంపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది. ఇక‌, ఉభ‌య గోదావ‌రి.. కోస్తా జిల్లాల్లోనూ పార్టీకి సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెబుతున్నారు.

అయితే, విశాఖ‌పై మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. వైసీపీ ప్ర‌క‌టించిన రాజ‌ధాని విషయంపై ప్ర‌జ‌లు గుంభ‌నంగా ఉన్నార‌ని.. కొంద‌రు వ‌ద్ద‌ని అంటున్నా .. మెజారిటీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారని.. ఆ ర‌కంగా అయినా త‌మ ప్రాంతం మ‌రింత డెవ‌ల‌ప్ అవుతుంద‌ని చెబుతున్నార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కోస్తాలోనూ అటు ఇటుగా టీడీపీకి సానుకూల ప‌వ‌నాలు ఉన్నాయ‌ని డిజిట‌ల్ స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

అయితే, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరుజిల్లాల్లో మాత్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని.. సీమ‌లో మాత్రం టీడీపీ ఎదురీత త‌ప్ప‌ద‌ని ఈ స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, చంద్ర‌బాబు గెలుపు సాధ్య‌మేన‌ని చెప్పిన స‌ర్వే.. నారా లోకేష్‌కు రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కేటాయింపులు త‌ప్ప‌ద‌ని తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ స‌ర్వేపై అనేక భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఎందుకంటే.. ఇది ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన చిన్న‌పాటి స‌ర్వే కావ‌డం.. కేవ‌లం ఒక్కొక్క ప్రాంతం నుంచి వెయ్యి .. రెండు వేల లోపు వారినే ప్ర‌శ్నించ‌డంతో మ‌రింత విస్తృతంగా స‌ర్వే చేయించాల‌ని పార్టీ అధినేత నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

1 hour ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago