Political News

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ అనుమానాలు కొట్టిపారేయటం తెలిసిందే. అనంతరం సీబీఐ అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఈ వైసీపీ ఎంపీకి సీబీఐ నుంచి నోటీసులు ఖాయమన్న ప్రచారం జరిగింది.

అవినాశ్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వాడు కావటం.. ఆయన పేరు కానీ వివేకా హత్య కేసులో అనుమానితుల జాబితాలో వస్తే దాని కారణంగా జరిగే నష్టం గురించి తెలియంది కాదు. అందుకే.. ఇంతకాలం తనకున్న అధికారం సాయంతో ముఖ్యమంత్రి అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే.. అక్కడఉన్నది సీబీఐ కావటం.. కేంద్రం వరకు విషయం వెళ్లడటంతో పాటు.. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా.. పకడబ్బందీగా చేపట్టాలన్న ఆదేశాలనుతూచా తప్పకుండాపాటించినట్లుగా చెబుతున్నారు.

అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఎన్నికలు ముంచుకురావటం.. ఆ హత్య వెనకున్నది టీడీపీ నేతలుగా ప్రచారం చేయటం.. అదేమీ నిజం కాదన్న విషయం చాలా త్వరగా అర్థం కావటం తెలిసిందే. అయితే.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరుపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదిలాఉండగా.. తాజాగా ఆయనకు వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించటం గమనార్హం. ఇంతకాలం నోటీసులు అందుకుంటారన్న ప్రచారం బోలెడంత మంది నుంచి వచ్చినా… అదేమీ నిజం కాదన్నట్లుగా వైసీపీ నేతలు పెద్దగా రియాక్టు కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సీబీఐ జారీ చేసిన నోటీసుల సారాంశాన్ని చూస్తే.. మంగళవారం ఉదయం 11 గంటలకు వివేకా హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అక్కడ.. ఎంపీ అవినాశ్ తన తండ్రి గురించి వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రానున్న పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. సీబీఐ ఇచ్చిన తాజా నోటీసులు.. రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

This post was last modified on January 24, 2023 6:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

32 minutes ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

2 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

3 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

4 hours ago