Political News

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ అనుమానాలు కొట్టిపారేయటం తెలిసిందే. అనంతరం సీబీఐ అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఈ వైసీపీ ఎంపీకి సీబీఐ నుంచి నోటీసులు ఖాయమన్న ప్రచారం జరిగింది.

అవినాశ్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వాడు కావటం.. ఆయన పేరు కానీ వివేకా హత్య కేసులో అనుమానితుల జాబితాలో వస్తే దాని కారణంగా జరిగే నష్టం గురించి తెలియంది కాదు. అందుకే.. ఇంతకాలం తనకున్న అధికారం సాయంతో ముఖ్యమంత్రి అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే.. అక్కడఉన్నది సీబీఐ కావటం.. కేంద్రం వరకు విషయం వెళ్లడటంతో పాటు.. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా.. పకడబ్బందీగా చేపట్టాలన్న ఆదేశాలనుతూచా తప్పకుండాపాటించినట్లుగా చెబుతున్నారు.

అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఎన్నికలు ముంచుకురావటం.. ఆ హత్య వెనకున్నది టీడీపీ నేతలుగా ప్రచారం చేయటం.. అదేమీ నిజం కాదన్న విషయం చాలా త్వరగా అర్థం కావటం తెలిసిందే. అయితే.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరుపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదిలాఉండగా.. తాజాగా ఆయనకు వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించటం గమనార్హం. ఇంతకాలం నోటీసులు అందుకుంటారన్న ప్రచారం బోలెడంత మంది నుంచి వచ్చినా… అదేమీ నిజం కాదన్నట్లుగా వైసీపీ నేతలు పెద్దగా రియాక్టు కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సీబీఐ జారీ చేసిన నోటీసుల సారాంశాన్ని చూస్తే.. మంగళవారం ఉదయం 11 గంటలకు వివేకా హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అక్కడ.. ఎంపీ అవినాశ్ తన తండ్రి గురించి వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రానున్న పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. సీబీఐ ఇచ్చిన తాజా నోటీసులు.. రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

This post was last modified on January 24, 2023 6:06 am

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

25 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

38 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

49 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago