Political News

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

అంచనాలు తప్పలేదు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా తప్పదన్న రీతిలో సాగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని ఆయన ఇంట్లోనే దారుణంగా హతమార్చిన ఉదంతం గురించి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి కొన్ని ఆరోపణల పేరుతో ప్రచారం జరగటం తెలిసిందే.

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. ఇవన్నీ అనుమానాలు కొట్టిపారేయటం తెలిసిందే. అనంతరం సీబీఐ అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు ఉన్నట్లుగా ప్రచారం జరగటం తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఈ వైసీపీ ఎంపీకి సీబీఐ నుంచి నోటీసులు ఖాయమన్న ప్రచారం జరిగింది.

అవినాశ్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వాడు కావటం.. ఆయన పేరు కానీ వివేకా హత్య కేసులో అనుమానితుల జాబితాలో వస్తే దాని కారణంగా జరిగే నష్టం గురించి తెలియంది కాదు. అందుకే.. ఇంతకాలం తనకున్న అధికారం సాయంతో ముఖ్యమంత్రి అడ్డుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే.. అక్కడఉన్నది సీబీఐ కావటం.. కేంద్రం వరకు విషయం వెళ్లడటంతో పాటు.. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా.. పకడబ్బందీగా చేపట్టాలన్న ఆదేశాలనుతూచా తప్పకుండాపాటించినట్లుగా చెబుతున్నారు.

అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఎన్నికలు ముంచుకురావటం.. ఆ హత్య వెనకున్నది టీడీపీ నేతలుగా ప్రచారం చేయటం.. అదేమీ నిజం కాదన్న విషయం చాలా త్వరగా అర్థం కావటం తెలిసిందే. అయితే.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పేరుపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇదిలాఉండగా.. తాజాగా ఆయనకు వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించటం గమనార్హం. ఇంతకాలం నోటీసులు అందుకుంటారన్న ప్రచారం బోలెడంత మంది నుంచి వచ్చినా… అదేమీ నిజం కాదన్నట్లుగా వైసీపీ నేతలు పెద్దగా రియాక్టు కాలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా సీబీఐ జారీ చేసిన నోటీసుల సారాంశాన్ని చూస్తే.. మంగళవారం ఉదయం 11 గంటలకు వివేకా హత్య కేసుకు సంబంధించి ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల లోని వైసీపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం అక్కడ.. ఎంపీ అవినాశ్ తన తండ్రి గురించి వివరాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా రానున్న పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. సీబీఐ ఇచ్చిన తాజా నోటీసులు.. రానున్న రోజుల్లో పలు రాజకీయ పరిణామాలకు వేదికగా మారుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

This post was last modified on January 24, 2023 6:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

42 minutes ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

3 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

4 hours ago

భార్య అందం చూసి భర్తకు పదవి ఇచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…

4 hours ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

5 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

6 hours ago