కడపజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైదుకూరు. ఇక్కడ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్దరే వ్యక్తులు.. ఒకరు తర్వాత.. ఒకరు.. గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ రవీంద్రారె డ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్దరే ఇక్కడ ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ తరఫున శెట్టిపల్లి 1985, 1999 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, 2014, 2019 ఎన్నికల్లో ఈయన వైసీపీ తరఫున విజయం సాధించారు.
మరోవైపు.. డీఎల్ రవీంద్రారెడ్డి తొలినాళ్లలో ఇండిపెండెంట్గా గెలిచి..తర్వాత కాంగ్రెస్తీర్థం పుచ్చుకు న్నారు. మొత్తంగా డీఎల్.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. పార్టీలు ఏవైనా కూడా శెట్టిపల్లి, డీఎల్ల మధ్యే మైదుకూరు రాజకీయం నడిచింది. ఎమ్మెల్యేలుగా వీరే చక్రం తిప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ తాజాగా తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా.. అంటే ఇంచార్జ్గా టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహరిస్తు న్నారు. 2014, 2019లో సుధాకర్కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కానీ, ఆయన ఓడిపోయారు. అయితే.. ఈయనకు టీడీపీలో నెంబర్ 2గా పిలుచుకునే యనమల రామకృష్ణుడు స్వయానా వియ్యంకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరిశీలించుకునే పనిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కానీ, పుట్టాకు మళ్లీ టికె ట్ఇవ్వడం అంటే.. కోరి వైసీపీకి ఇక్కడ విజయాన్ని అందించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో డీఎల్ విషయం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నట్టుగా చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈయనను టీడీపీ సైకిల్ ఎక్కించుకుని టికెట్ ఇస్తే.. మైదుకూరులో గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు.
This post was last modified on January 23, 2023 6:47 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…