కడపజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మైదుకూరు. ఇక్కడ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్దరే వ్యక్తులు.. ఒకరు తర్వాత.. ఒకరు.. గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ రవీంద్రారె డ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్దరే ఇక్కడ ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పుతున్నారు. టీడీపీ తరఫున శెట్టిపల్లి 1985, 1999 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఇక, 2014, 2019 ఎన్నికల్లో ఈయన వైసీపీ తరఫున విజయం సాధించారు.
మరోవైపు.. డీఎల్ రవీంద్రారెడ్డి తొలినాళ్లలో ఇండిపెండెంట్గా గెలిచి..తర్వాత కాంగ్రెస్తీర్థం పుచ్చుకు న్నారు. మొత్తంగా డీఎల్.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. పార్టీలు ఏవైనా కూడా శెట్టిపల్లి, డీఎల్ల మధ్యే మైదుకూరు రాజకీయం నడిచింది. ఎమ్మెల్యేలుగా వీరే చక్రం తిప్పారు. అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ తరఫున ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ తాజాగా తెరమీదికి వచ్చింది.
ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా.. అంటే ఇంచార్జ్గా టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ వ్యవహరిస్తు న్నారు. 2014, 2019లో సుధాకర్కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కానీ, ఆయన ఓడిపోయారు. అయితే.. ఈయనకు టీడీపీలో నెంబర్ 2గా పిలుచుకునే యనమల రామకృష్ణుడు స్వయానా వియ్యంకుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరిశీలించుకునే పనిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కానీ, పుట్టాకు మళ్లీ టికె ట్ఇవ్వడం అంటే.. కోరి వైసీపీకి ఇక్కడ విజయాన్ని అందించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో డీఎల్ విషయం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన వైసీపీలో ఉన్నట్టుగా చెబుతున్నా.. అలాంటిదేమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో.. ఈయనను టీడీపీ సైకిల్ ఎక్కించుకుని టికెట్ ఇస్తే.. మైదుకూరులో గెలుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు.
This post was last modified on January 23, 2023 6:47 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…