తెలంగాణ రాజ్భవన్ వర్సెస్ అధికార పార్టీ ప్రధాన కార్యాలయం ప్రగతి భవన్ల మధ్య మళ్లీ రాజకీయ రచ్చ ప్రారంభమైందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గత రెండేళ్లుగా రాజ్భవన్కు, సీఎం కేసీఆర్కు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తనకు వేతనం కూడా ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ కూడా దక్కడం లేదని.. ఇటీవల కూడా గవర్నర్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న కార్యక్రమంలో మాత్రం ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. దీంతో హమ్మయ్య.. సమస్య సమసి పోయినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ, ఎడమొహం పెడమొహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామంతో ఈ రెండు భవన్ల మధ్య పొసగడం లేదని.. ఇది ఇప్పట్లో కుదిరేపని కూడా కాదని.. ఒక వాదన వినిపిస్తోంది.
తాజాగా జనవరి 26 గణతంత్ర వేడుకలకు రాష్ట్రం రెడీ అవుతోంది. ఈ కార్యక్రమానికి అయినా.. ప్రభుత్వం నుంచి రాజ్భవన్కు ఆహ్వానం అందుతుందని రాజ్భవన్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. మరో మూడు రోజుల్లోనే కార్యక్రమం జరగనుండగా.. ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు.. ప్రభుత్వం నుంచి రానేలేదు. దీంతో రాజ్భవన్లోనే ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక, ప్రభుత్వం కూడా.. తన మానాన తను ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రగతి భవన్లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈ దఫా బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం కూడా దానికి తగినట్టుగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రగతి భవన్, రాజ్భవన్ల మధ్య సెగలు పొగలు ఇంకా సర్దుబాటు కాకపోవడం గమనార్హం.
This post was last modified on January 23, 2023 6:25 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…