టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. ఇక్కడి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆయన ఒక్కరే కుప్పం నుంచి విజయం దక్కించుకున్నారు. మిగిలిన నియోజకవర్గాలను వైసీపీదక్కించుకుంది. అయితే ..ఇప్పుడు చంద్రబాబుకు ప్రాణసంకటంగా మారిన ఈ జిల్లాలో మరోసారి వెలుగు వెలగాలని నిర్ణయించు కున్నారు. ముఖ్యంగా టీడీపీని విమర్శించేవారికి చెక్ పెట్టాలనేది ఆయన వ్యూహం.
మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంగా ఉన్నవారిని చిత్తుచిత్తుగా ఓడించాలనేది చంద్రబాబు కల. ఈ క్రమంలోనే తన సొంత గ్రామం ..పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో సైకిల్ ను రయ్ రయ్న తిప్పాలనేది వ్యూహం. కానీ, ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇంతింతై.. అన్నట్టుగా.. ఇక్కడ వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి రోజు రోజుకు ఇమేజ్ పెంచుకుంటున్నారు.
ఆయన ఎక్కడా పెద్ద ఎత్తున సభలు పెట్టరు. అలాగని నిత్యం ప్రజల్లోనూ ఉండరు. దాదాపు వారంలో మూడు రోజులు తాడేపల్లికి వచ్చి.. సీఎం కుటుంబానికి అవసరమైనవి ఏర్పాటు చేసి వెళ్తుంటారు. ఇక, మిగిలిన నాలుగు రోజుల్లో మూడు రోజులు వ్యాపారాలకు కేటాయిస్తున్నారు. మరి ఇంత బిజీగా ఉండడంతో ఆయన అసలు నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదా? అంటే.. అన్నీ ఆయన కుమారుడు చూసుకుంటున్నారు.
పార్టీలకు అతీతంగా.. అందరికీ అన్నీ అనే ఫార్ములాను అవలంబిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు ఖరీదైన బట్టలు పెట్టారు. స్వీట్లు, హాట్లు పంచారు. ఇక, కరోనాసమయంలో పేదా సాదా అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ శానిటైజర్లు, మాస్కులు నెలకు రెండు సార్లు పంచారు. ఆనందయ్య కరోనా మందును ఇంటింటికీ స్వయంగా అందించారు. దీంతో చంద్రగిరిలో ఇప్పుడు ఎటు విన్నా చెవిరెడ్డి పేరు మార్మోగుతోంది. పలితంగా టీడీపీ వాయిస్ వినిపించడం లేదు. జెండా కనిపించడం లేదు. ఇది నిజం!!
This post was last modified on January 22, 2023 1:22 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…