Political News

విజ‌య‌మ్మ వీడియోతో జ‌గ‌న్‌కు షాక్‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27న యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని 4 వంద‌ల రోజుల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ముసుగులో గుద్దులాట‌కు దిగింది.

అనుమ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌య‌మూ చెప్ప‌కుండా వేధిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు అంటు న్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అనుమ‌తులు కోరుతూ.. టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రూట్ మ్యాప్‌ను కూడా అందించారు. ఏయే జిల్లాలు, ఎన్నేసి రోజులు అనే విష‌యంపై ఆయ‌న వివ‌రించారు. అయితే.. ఎట్ట‌కేల‌కు స్పందించిన డీజీపీ.. పాద‌యాత్ర‌లో ఎంత మంది పాల్గొంటున్నారు? ఏయే వాహ‌నాలు పెడుతున్నారు.. అంటూ.. మ‌రిన్ని వివ‌రాలు కోరారు.

అయితే.. పాద‌యాత్ర అనేది అప్ప‌టి వ‌ర‌కు ఉండే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌జ‌లు పాల్గొంటారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఇలాంటి వివ‌రాలు కోర‌కుండా అప్ప‌టి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం డీజీపీ ద్వారా స‌ర్కారు అడ్డంకులు సృష్టిస్తోంద‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్ప‌టి స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు అప్ప‌టి డీజీపీకి రాసిన లేఖ‌ను టీడీపీనేత‌లు మీడియాకు వెల్ల‌డించారు.

అప్ప‌టి పాద‌యాత్ర‌కు సంబంధించి పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి.. ఆశ్చ‌ర్య‌క‌రంగా వ్యాఖ్య లు చేశారు. పాద‌యాత్ర చేస్తున్నాం.. అనుమ‌తికోరాం.. అంతే.. వివ‌రాలు డీజీపీకి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా పాద‌యాత్ర‌పై అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్య‌ల తాలూకు బైట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌జాస్వామ్యంలోపాద‌యాత్ర చేసుకునే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని.. ప్ర‌భుత్వాలు వాటికి అడ్డు చెప్ప‌రా ద‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని కూడా ఆమె అన్నారు. పాద‌యాత్ర ల‌కు అనుమ‌తించాల‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని.. అప్పుడే మంచి ప్ర‌భుత్వం అనిపించుకుంటుం ద‌ని ఆమె అన్నారు. ఇది.. జ‌గ‌న్ స‌ర్కారుకు చెంప పెట్టుగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక‌వైపు యువ‌గ‌ళానికి అడ్డంకులు పెడుతున్న జ‌గ‌న్‌.. త‌న మాతృమూర్తి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు గుర్తు చేసుకోవాల‌ని టీడీపీ అభిమానులు, నెటిజ‌న్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on January 22, 2023 6:53 pm

Share

Recent Posts

వావ్… ఏపీ లో యూఏఈ పెట్టుబడులు

ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…

45 minutes ago

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…

4 hours ago

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద…

9 hours ago

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

11 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

11 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

12 hours ago