Political News

విజ‌య‌మ్మ వీడియోతో జ‌గ‌న్‌కు షాక్‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ఈ నెల 27న యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. సుమారు 4 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని 4 వంద‌ల రోజుల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ముసుగులో గుద్దులాట‌కు దిగింది.

అనుమ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌య‌మూ చెప్ప‌కుండా వేధిస్తోంద‌ని టీడీపీ నాయ‌కులు అంటు న్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అనుమ‌తులు కోరుతూ.. టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రూట్ మ్యాప్‌ను కూడా అందించారు. ఏయే జిల్లాలు, ఎన్నేసి రోజులు అనే విష‌యంపై ఆయ‌న వివ‌రించారు. అయితే.. ఎట్ట‌కేల‌కు స్పందించిన డీజీపీ.. పాద‌యాత్ర‌లో ఎంత మంది పాల్గొంటున్నారు? ఏయే వాహ‌నాలు పెడుతున్నారు.. అంటూ.. మ‌రిన్ని వివ‌రాలు కోరారు.

అయితే.. పాద‌యాత్ర అనేది అప్ప‌టి వ‌ర‌కు ఉండే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌జ‌లు పాల్గొంటారు. గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఇలాంటి వివ‌రాలు కోర‌కుండా అప్ప‌టి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కానీ, ఇప్పుడు మాత్రం డీజీపీ ద్వారా స‌ర్కారు అడ్డంకులు సృష్టిస్తోంద‌ని.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే గ‌తంలో జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్ప‌టి స‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు అప్ప‌టి డీజీపీకి రాసిన లేఖ‌ను టీడీపీనేత‌లు మీడియాకు వెల్ల‌డించారు.

అప్ప‌టి పాద‌యాత్ర‌కు సంబంధించి పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి.. ఆశ్చ‌ర్య‌క‌రంగా వ్యాఖ్య లు చేశారు. పాద‌యాత్ర చేస్తున్నాం.. అనుమ‌తికోరాం.. అంతే.. వివ‌రాలు డీజీపీకి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ మాతృమూర్తి విజ‌య‌మ్మ కూడా పాద‌యాత్ర‌పై అప్ప‌ట్లో చేసిన వ్యాఖ్య‌ల తాలూకు బైట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌జాస్వామ్యంలోపాద‌యాత్ర చేసుకునే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని.. ప్ర‌భుత్వాలు వాటికి అడ్డు చెప్ప‌రా ద‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని కూడా ఆమె అన్నారు. పాద‌యాత్ర ల‌కు అనుమ‌తించాల‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించాల‌ని.. అప్పుడే మంచి ప్ర‌భుత్వం అనిపించుకుంటుం ద‌ని ఆమె అన్నారు. ఇది.. జ‌గ‌న్ స‌ర్కారుకు చెంప పెట్టుగా మారింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక‌వైపు యువ‌గ‌ళానికి అడ్డంకులు పెడుతున్న జ‌గ‌న్‌.. త‌న మాతృమూర్తి గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు గుర్తు చేసుకోవాల‌ని టీడీపీ అభిమానులు, నెటిజ‌న్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago