ఏపీలో మైనారిటీ వర్గం ఓట్లు ఒకప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత తీసుకున్న చర్యలు, తీసుకువచ్చిన 4 శాతం రిజర్వేషన్ వంటివి ఆ వర్గాన్ని కాంగ్రెస్కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన తర్వాత ఈ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడం జగన్ అండ్ కో సక్సెస్ అయ్యారు. ఈ పరిణామాలతోనే 2014 ఎన్నికల్లో ఏపీలో మైనారిటీ అభ్యర్థులకు ఇచ్చిన స్థానాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది.
అదేసమయంలో టీడీపీ ఆయా స్థానాలను కోల్పోయింది. దీంతో చంద్రబాబు హయాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే, గత 2019 ఎన్నికల్లో వైసీపీ.. మరోసారి మైనారిటీ వర్గాల ఓట్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కడప నుంచి గెలిచిన మైనారిటీ నాయకుడు అంజాద్ బాషాకు రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు సీఎం జగన్.
అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో మైనారిటీ వర్గం ఎటు మళ్లుతుంది? అనేది ప్రశ్నగా మారింది ఎందుకంటే.. మైనారిటీ వర్గంలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. వారిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో మైనార్టీలకు వారు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా అధిష్టానం వైఖరిపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తాను వైసీపీకి నమ్మిన బంటునని చెప్పుకొనే ఆయనకు కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదని ఆయన వర్గం చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికలకు సంబంధించి తన కుమార్తెకు టికెట్ ప్రకటించేసుకున్నారు. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నానని చెప్పకనే చెప్పారు. కర్నూలులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మైనారిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని.. ఇటీవల కర్నూలులో ఈ వర్గం ముస్లింలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి మైనారిటీలు దూరమవుతున్నారనే భావన స్పష్టంగా కనిపిస్తోంది.
This post was last modified on January 22, 2023 12:03 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…