Political News

మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

అదేస‌మ‌యంలో టీడీపీ ఆయా స్థానాల‌ను కోల్పోయింది. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ‌ను కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే, గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ.. మ‌రోసారి మైనారిటీ వ‌ర్గాల ఓట్ల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప నుంచి గెలిచిన మైనారిటీ నాయ‌కుడు అంజాద్ బాషాకు రెండు సార్లు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైనారిటీ వ‌ర్గం ఎటు మ‌ళ్లుతుంది? అనేది ప్ర‌శ్న‌గా మారింది ఎందుకంటే.. మైనారిటీ వ‌ర్గంలో అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో మైనార్టీల‌కు వారు స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా అధిష్టానం వైఖ‌రిపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాను వైసీపీకి న‌మ్మిన బంటున‌ని చెప్పుకొనే ఆయ‌న‌కు క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న కుమార్తెకు టికెట్ ప్ర‌క‌టించేసుకున్నారు. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైనారిటీల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా చేసింది ఏమీ లేద‌ని.. ఇటీవల క‌ర్నూలులో ఈ వ‌ర్గం ముస్లింలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి మైనారిటీలు దూర‌మ‌వుతున్నార‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

This post was last modified on January 22, 2023 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago