Political News

మైనారిటీలు వైసీపీకి దూర‌మ‌వుతున్నారా?

ఏపీలో మైనారిటీ వ‌ర్గం ఓట్లు ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సీఎం అయిన త‌ర్వాత తీసుకున్న చ‌ర్య‌లు, తీసుకువ‌చ్చిన 4 శాతం రిజ‌ర్వేష‌న్ వంటివి ఆ వ‌ర్గాన్ని కాంగ్రెస్‌కు చేరువ చేశాయి. అయితే, వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఈ వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకోవ‌డం జ‌గ‌న్ అండ్ కో స‌క్సెస్ అయ్యారు. ఈ ప‌రిణామాల‌తోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో మైనారిటీ అభ్య‌ర్థుల‌కు ఇచ్చిన‌ స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

అదేస‌మ‌యంలో టీడీపీ ఆయా స్థానాల‌ను కోల్పోయింది. దీంతో చంద్ర‌బాబు హ‌యాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ‌ను కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. ఇదిలావుంటే, గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ.. మ‌రోసారి మైనారిటీ వ‌ర్గాల ఓట్ల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప నుంచి గెలిచిన మైనారిటీ నాయ‌కుడు అంజాద్ బాషాకు రెండు సార్లు డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చారు సీఎం జ‌గ‌న్‌.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైనారిటీ వ‌ర్గం ఎటు మ‌ళ్లుతుంది? అనేది ప్ర‌శ్న‌గా మారింది ఎందుకంటే.. మైనారిటీ వ‌ర్గంలో అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారిని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో మైనార్టీల‌కు వారు స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా అధిష్టానం వైఖ‌రిపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాను వైసీపీకి న‌మ్మిన బంటున‌ని చెప్పుకొనే ఆయ‌న‌కు క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న కుమార్తెకు టికెట్ ప్ర‌క‌టించేసుకున్నారు. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైనారిటీల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా చేసింది ఏమీ లేద‌ని.. ఇటీవల క‌ర్నూలులో ఈ వ‌ర్గం ముస్లింలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి మైనారిటీలు దూర‌మ‌వుతున్నార‌నే భావ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

This post was last modified on January 22, 2023 12:03 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

1 hour ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

2 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

12 hours ago