మొత్తం 23 మంది నాయకులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చ సాగుతోంది. వారే .. 2017-18 మధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంతకు చేరారు. సరే.. వీరిపై రాజకీయ విమర్శ లు, ప్రతివిమర్శలు కామనే అనుకున్నా.. వీరందరికీ చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు.
నిజానికి వీరికి ఇవ్వొద్దని.. ఐదారుగురి విషయంలో ఫర్వాలేదని చంద్రబాబుకు నివేదికలు అందాయి. అయినప్పటికీ.. చేర్చుకునే క్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్పటికే టీడీపీలో ఉండి.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించిన వారికి అన్యాయం జరిగిందనే భావనతో వారంతా రెబల్స్గా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. వీరంతా ఓడిపోయేలా చేశారు.
అయితే.. ఒక్క అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి మాత్రం విజయం దక్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయనపైనా వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మారమని సూచించినా.. ఆయన మారలేదు. ఇది వేరే సంగతి. కట్ చేస్తే.. మిగిలిన 22 మందిలో అమర్నాథ్రెడ్డి(పలమనేరు), పితాని సత్యనారాయణ(ఆచంట), సుజయ్ కృష్ణ రంగారావు(బొబ్బిలి), వంతల రాజేశ్వరి(రంపచోడవరం) వంటివారు మాత్రమే అప్పుడప్పుడు రాజకీయంగా దర్శనమిస్తున్నారు.
మరి మిగిలిన వారు ఏమైనట్టు? అంటే.. వీరిలో ఆదినారాయణ(కడప) బీజేపీలో చేరారు. మిగిలిన వారు మాత్రం అసలు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి కారణం వారు బయటకు రారు. వచ్చినా మాట్లాడరు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరు చేద్దామంటే.. కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది సందేహంగా మారడమే! ఇస్తారని వీళ్లు.. ఇచ్చేది లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on January 22, 2023 10:26 am
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…