మొత్తం 23 మంది నాయకులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చ సాగుతోంది. వారే .. 2017-18 మధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంతకు చేరారు. సరే.. వీరిపై రాజకీయ విమర్శ లు, ప్రతివిమర్శలు కామనే అనుకున్నా.. వీరందరికీ చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు.
నిజానికి వీరికి ఇవ్వొద్దని.. ఐదారుగురి విషయంలో ఫర్వాలేదని చంద్రబాబుకు నివేదికలు అందాయి. అయినప్పటికీ.. చేర్చుకునే క్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్పటికే టీడీపీలో ఉండి.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించిన వారికి అన్యాయం జరిగిందనే భావనతో వారంతా రెబల్స్గా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. వీరంతా ఓడిపోయేలా చేశారు.
అయితే.. ఒక్క అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి మాత్రం విజయం దక్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయనపైనా వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మారమని సూచించినా.. ఆయన మారలేదు. ఇది వేరే సంగతి. కట్ చేస్తే.. మిగిలిన 22 మందిలో అమర్నాథ్రెడ్డి(పలమనేరు), పితాని సత్యనారాయణ(ఆచంట), సుజయ్ కృష్ణ రంగారావు(బొబ్బిలి), వంతల రాజేశ్వరి(రంపచోడవరం) వంటివారు మాత్రమే అప్పుడప్పుడు రాజకీయంగా దర్శనమిస్తున్నారు.
మరి మిగిలిన వారు ఏమైనట్టు? అంటే.. వీరిలో ఆదినారాయణ(కడప) బీజేపీలో చేరారు. మిగిలిన వారు మాత్రం అసలు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి కారణం వారు బయటకు రారు. వచ్చినా మాట్లాడరు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరు చేద్దామంటే.. కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది సందేహంగా మారడమే! ఇస్తారని వీళ్లు.. ఇచ్చేది లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on January 22, 2023 10:26 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…