మొత్తం 23 మంది నాయకులు. అయితే, వీరిలో 22 మంది చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చ సాగుతోంది. వారే .. 2017-18 మధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీ చెంతకు చేరారు. సరే.. వీరిపై రాజకీయ విమర్శ లు, ప్రతివిమర్శలు కామనే అనుకున్నా.. వీరందరికీ చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు.
నిజానికి వీరికి ఇవ్వొద్దని.. ఐదారుగురి విషయంలో ఫర్వాలేదని చంద్రబాబుకు నివేదికలు అందాయి. అయినప్పటికీ.. చేర్చుకునే క్రమంలో ఇచ్చిన హామీ మేరకు ఆయన వారికి టికెట్లు ఇచ్చారు. అయితే.. అప్పటికే టీడీపీలో ఉండి.. పార్టీ తరఫున బలమైన గళం వినిపించిన వారికి అన్యాయం జరిగిందనే భావనతో వారంతా రెబల్స్గా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలు పెరిగి.. వీరంతా ఓడిపోయేలా చేశారు.
అయితే.. ఒక్క అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి మాత్రం విజయం దక్కించుకున్నారు. 2020-21 మధ్య ఆయనపైనా వైసీపీ ఒత్తిడి తెచ్చి పార్టీ మారమని సూచించినా.. ఆయన మారలేదు. ఇది వేరే సంగతి. కట్ చేస్తే.. మిగిలిన 22 మందిలో అమర్నాథ్రెడ్డి(పలమనేరు), పితాని సత్యనారాయణ(ఆచంట), సుజయ్ కృష్ణ రంగారావు(బొబ్బిలి), వంతల రాజేశ్వరి(రంపచోడవరం) వంటివారు మాత్రమే అప్పుడప్పుడు రాజకీయంగా దర్శనమిస్తున్నారు.
మరి మిగిలిన వారు ఏమైనట్టు? అంటే.. వీరిలో ఆదినారాయణ(కడప) బీజేపీలో చేరారు. మిగిలిన వారు మాత్రం అసలు పార్టీలోనే ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి కారణం వారు బయటకు రారు. వచ్చినా మాట్లాడరు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరు చేద్దామంటే.. కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది సందేహంగా మారడమే! ఇస్తారని వీళ్లు.. ఇచ్చేది లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on January 22, 2023 10:26 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…