Political News

రేపల్లెలో రెడీ అవుతున్న మోపిదేవి కుమారుడు

నాయకులంతా తమ వారసులను రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా అదే రూట్లో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని అసెంబ్లీ బరిలో దించడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, జగన్ తాను సీఎం కావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు.

కానీ, శాసనమండలిలో టీడీపీ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి గాను ఏకంగా శాసనమండలినే రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చిన జగన్ ఆ సమయంలో మోపిదేవి, పిల్లి సుభాస్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపించారు. అలా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మోపిదేవి ఈ మూడేళ్లలో అనేక పాత్రలు పోషించాల్సి వచ్చింది.

2020 జూన్‌లో రాజ్యసభకు వెళ్లిన మోపిదేవికి 2026 వరకు పదవీకాలం ఉంది. దీంతో 2024లో ఆయన మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయాలంటే రెండేళ్ల పదవీకాలాన్ని వదులుకుని పోటీ చేయాలి. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు రాజీవ్‌ను బరిలో దించాలని మోపిదేవి యోచిస్తున్నారట. అయితే.. జగన్ నుంచి ఇంకా క్లియరెన్స్ తెచ్చుకోకపోవడంతో రాజీవ్‌ను ఇంకా రంగంలోకి దించలేదని ఆయన అనుచరులు చెప్తున్నారు. జగన్ దగ్గర మంచి పేరు ఉన్న మోపిదేవికి తెలియకుండా రేపల్లె టికెట్ విషయంలో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

అయితే.. మోపిదేవినే పోటీ చేయమని జగన్ ఒత్తిడి చేసే అవకాశం ఉందనేది ఆయన వర్గీయుల మాట. అందుకే.. జగన్ వద్ద ఓకే చేయించుకుని తన కుమారుడిని రేపల్లె నియోజకవర్గానికి పరిచయం చేయాలని మోపిదేవి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే గత రెండు పర్యాయాలుగా రేపల్లెలో మోపిదేవికి ఓటమి ఎదురవుతోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన నాయకుడిగా ప్రజలు ఆదరించలేదు అనుకున్నా 2019లో జగన్ గాలి జోరుగా వీచినప్పుడు కూడా మోపిదేవి రేపల్లెలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు కుమారుడిని అక్కడే బరిలో దించడం శ్రేయస్కరమేనా అని కూడా మోపిదేవి ఆలోచిస్తున్నారని టాక్.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

11 hours ago