Political News

వరవరరావు పరిస్థితి ఏమంత బాలేదు

బీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రెండేళ్లుగా మహారాష్ట్ర జైలులో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, కవి వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన అంపశయ్యపై ఉన్నారని.. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతారని అంటున్నారు.

స్వయంగా ఆయన తరఫున లాయర్ సుదీప్ పస్బోలా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వరవరరావు.. ఇటీవల తన భార్యతో ఫోన్లో మాట్లాడినపుడు ఆమెను గుర్తించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనేక డిమాండ్ల తర్వాత ఆయన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.

ఐతే అదే సమయంలో ఆయనకు కరోనా సోకింది. అసలే తీవ్ర అనారోగ్యం, పైగా కరోనా సోకడంతో వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థితిలో వరవరరావు ఏమీ ఆలోచించే స్థితిలో లేరని.. విచారణను ప్రభావితం చేసే స్థితిలోనూ లేరని.. చివరి దశలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టుకు లాయర్ విన్నవించారు.

‘‘వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశముంది. కనీసం తన కుటుంబ సభ్యుల మధ్య చనిపోయే అవకాశాన్ని ఆయనకు ఇవ్వండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే పరిస్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని కోర్టుకు లాయర్ విన్నవించారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కవులు, రచయితలు వరవరరావును డిమాండ్ చేయాలన్న పిటిషన్ మీద సంతకాలు చేస్తుండటం గమనార్హం.

This post was last modified on July 21, 2020 4:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: Varavara Rao

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago