బీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రెండేళ్లుగా మహారాష్ట్ర జైలులో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, కవి వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన అంపశయ్యపై ఉన్నారని.. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతారని అంటున్నారు.
స్వయంగా ఆయన తరఫున లాయర్ సుదీప్ పస్బోలా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వరవరరావు.. ఇటీవల తన భార్యతో ఫోన్లో మాట్లాడినపుడు ఆమెను గుర్తించలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనేక డిమాండ్ల తర్వాత ఆయన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.
ఐతే అదే సమయంలో ఆయనకు కరోనా సోకింది. అసలే తీవ్ర అనారోగ్యం, పైగా కరోనా సోకడంతో వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత స్థితిలో వరవరరావు ఏమీ ఆలోచించే స్థితిలో లేరని.. విచారణను ప్రభావితం చేసే స్థితిలోనూ లేరని.. చివరి దశలో ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టుకు లాయర్ విన్నవించారు.
‘‘వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశముంది. కనీసం తన కుటుంబ సభ్యుల మధ్య చనిపోయే అవకాశాన్ని ఆయనకు ఇవ్వండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే పరిస్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని కోర్టుకు లాయర్ విన్నవించారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కవులు, రచయితలు వరవరరావును డిమాండ్ చేయాలన్న పిటిషన్ మీద సంతకాలు చేస్తుండటం గమనార్హం.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…