Modi
ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యూహాలకు పదును పెంచారా? వచ్చే మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన రెండు తెలుగు రాష్ట్రాలుసహా.. దక్షిణాదిలో పాగా వేసేలా తన కార్యాచరణను రెడీ చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు మోడీకి అత్యంత కీలకమైన సంవత్సరం నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.
దీంతో మోడీ.. తాజాగా కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రెండు కీలక విషయాలు ప్రస్తావించారు. ఒకటి ఎప్పుడూ చెప్పే డబుల్ ఇంజన్ కాగా.. మరొకటి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పై ఆయన కామెంట్లు చేశారు. ఒక రాష్ట్రం అప్పులు ఇవ్వట్లేదని తనను తిడుతోందని అన్నారు. మరో రాష్ట్రం.. అప్పులు తీసుకుని ఏమవుతోందో మనం చూస్తూనే ఉన్నాం అని వ్యాఖ్యానించారు.
నిజానికి మోడీ.. ఈ విషయంలో కామెంట్లు చేసినప్పుడు రాష్ట్రాల పేర్లను ఎక్కడా బయట పెట్టలేదు. కానీ, అంతర్లీనంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదేసమయంలో డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా.. అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. నిజానికి ఒక రాష్ట్రం అప్పులు చేస్తోందని చెప్పినా.. మరో రాష్ట్రం అప్పుల కోసం ప్రయత్నిస్తోందని అన్నా.. దీని వెనుక మోడీ చతురత రాజకీయ వ్యూహం రెండూ ఉన్నాయి.
ఏపీలో అనుకూల సీఎం ఉండడంతో మోడీ సహకరిస్తున్నారనే కామెంట్లు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నా యి. అదేసమయంలో తెలంగాణలో తనను వ్యతిరేకిస్తున్న సీఎం ఉండడంతో ఆ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడం లేదని అక్కడి మంత్రులే చెబుతున్నారు. ఈ పరిణామాలకు కేంద్రం మోడీనే అయితే.. ఆయన మాత్రం వ్యూహాత్మకంగా ఈ రెండు రాష్ట్రాలను అడ్డు పెట్టి కన్నడిగులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం. అందుకే దటీజ్ మోడీ అంటున్నారు నెటిజన్లు.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…