Political News

మాజీ సీఎం కుమారుడికి గెలిచే సీన్ ఉందా?!

ఆయ‌న పేరుకు మాజీ సీఎం కుమారుడు. కానీ, రాజ‌కీయాల్లో అనుభవం త‌క్కువ‌. పైగా ఎక్కువ కాలం విదేశాల్లో ఉండి వ‌చ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం లోక‌ల్ పాలిటిక్స్‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఆయ‌నే నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నేదురు మ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, మాజీ మంత్రి రాజ్య‌ల‌క్ష్మిల కుమారుడు రామ్‌. నిజానికి కాంగ్రెస్ హ‌యాంలో దంప‌తులు ఇద్ద‌రూ చ‌క్రం తిప్పారు.

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు కూడా ద‌క్కించుకున్నా రు. అయితే.. ఇది చ‌రిత్ర‌. ఒక‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికీ తేడా ఉంది. పైగా ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేని రామ్‌.. ఇప్పుడు వైసీపీ త‌ర‌ఫున పోటీకి రెడీ అవుతున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇదే కార‌ణంగా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. ప్ర‌జ‌ల‌తోముందు సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల‌ని.. అప్ప‌ట్లో జ‌గ‌న్ చెప్పారు.

మ‌రి అప్ప‌టికి.. ఇప్ప‌టికి కూడా రామ్ ప‌రిస్థితిలో పెద్ద‌గా మార్పు క‌నిపించ‌డం లేదు. కానీ, ఆయ‌న మాత్రం టికెట్ కోరుకుంటున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. వెంక‌ట‌గిరిలో 2009, 2014లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. రెడ్డి వ‌ర్గంలో స‌గం మంది గ‌తంలో ఇక్క‌డ టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఆశ‌లు పెట్టుకుని.. మ‌రీ జ‌గ‌న్ కోస‌మైనా అన్న‌ట్టుగా ఇక్క‌డ వైసీపీని గెలిపించారు.

అయితే.. అప్పుడు రెడ్డి వ‌ర్గం పెట్టుకున్న ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌ని ఆ వ‌ర్గ‌మే త‌ర‌చుగా ఆరోపిస్తోంది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో వెంక‌ట‌గిరి రెడ్లు.. ఇప్పుడు మ‌రోసారి టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో నేదురుమ‌ల్లి రామ్‌కుమార్‌కు వారు అండ‌గా ఉంటారా? ఉండరా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on January 20, 2023 5:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago