ఔను.. ఏపీ సీఎం జగన్కు ఇప్పుడు ఎవరు కావాలి? మోడీ కావాలా? కేసీఆర్ కావాలా? ఇదీ… ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేతల మధ్య సాగుతున్న చర్చ. దీనికి కారణం.. బీఆర్ ఎస్ పార్టీని ఏపీలో విస్తరించా లని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని.. కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే.. తనపై ఉన్న కేసుల నేపథ్యంలో మోడీతో సహకరించాల్సిన అవసరం కనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల మాట. అంతేకాదు.. వివేకానంద కేసు కూడా ఉంది. ఈ విషయాల్లో కేసీఆర్ సహకారం ఉండేది లేదు. పైగా ఆయన కేంద్రంలో విస్తరించేందుకు కూడా చాలా సమయం పడుతుంది. అదే సమయంలో ఆయన అసలు విస్తరణపైనా.. అనేక సందేహాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, మరోవైపు, ఏపీలో బీఆర్ఎస్ విస్తరిస్తే.. మాత్రం దానిని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చగలిగే శక్తి ఉన్న పార్టీగా బీఆర్ఎస్ను భావిస్తున్నారు. అందుకే జరుగుతున్న పరిణామాలపై జగన్ అండ్ కో మౌనంగా ఉంటున్నారు.
వచ్చినా మంచిదే అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్కు పడితే, అది తమకు మేలు చేస్తుందనే అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ను బాహాటంగా సమర్ధించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు జగన్ విషయంపై తర్జన భర్జన పడుతోంది. ఆయనను కలుపుకొనేందుకు ఉత్సాహం ఉన్నప్పటికీ.. జగన్ వైఖరితో ఒకింత వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఏం చేస్తుందనేది చూడాలి.
This post was last modified on January 20, 2023 9:00 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…