Political News

2024 ఎఫెక్ట్: మోడీ నోట సంచ‌ల‌న మాట‌..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోట‌.. ఎప్పుడూ విన‌ని మాట‌.. తాజాగా వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ద్ధ శ‌త్రువులుగా చూస్తున్న‌.. అస‌లు వారిని మ‌నుషులుగా కూడా ప‌రిగ‌ణించ‌ని.. ముస్లిం వ‌ర్గంపై ప్ర‌ధాని మోడీ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ.. ముస్లింల‌కు చేరువ కావాల‌ని.. ఆదిశ‌గా వారిని ఆక‌ర్షించాల‌ని ఆయ‌న చెప్ప‌డం.. నిజంగానే ప్ర‌పంచంలో ఎనిమిదో వింత అనే చెప్పాలి.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ముఖ్యంగా దేశంలోనే పెద్ద రాష్ట్రం యూపీలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా ముస్లింల‌కు కేటాయించ‌లేదు. ఇక‌, దేశంలోనూ ఇదే ప‌రిస్థితి. అంతేకాదు.. మోడీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ట్రిపుల్ త‌లాక్ వంటి వాటిని ర‌ద్దు చేశారు. ఇక‌, త్వ‌ర‌లోనే జ‌నాభా నియంత్ర‌ణ కూడా చేప‌ట్ట‌నున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో అనూహ్యంగా మోడీ నోట ముస్లిం మాట రావ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ మోడీ ఏమ‌న్నారంటే.. ముస్లింలు సహా మైనారిటీలందరికీ చేరువ కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికలకు సుమారు 400 రోజులే మిగిలి ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. ఓట్లు ఆశించకుండా పాస్మాండా ముస్లింలు, బొహ్రాలు, ముస్లింలలో వృత్తి నిపుణులు, విద్యావంతులను కలుసుకోండి అని క్లాస్ ఇచ్చారు.

అంతేకాదు.. క్రిస్టియ‌న్లకు చెందిన‌ చర్చిలను సందర్శించాలని మోడీ నిర్దేశించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు పాస్మాండా ముస్లింలను కలుసుకుని, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని మోడీ సూచించారు. మ‌రి అనూహ్య మార్పునకు రీజ‌నేంటి? అంటే.. 2024 ఎన్నిక‌ల ఎఫెక్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని భావిస్తున్న మోడీ.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని సైతం ప‌క్క‌న పెట్టి ముస్లింల‌ను కీల‌కంగా భావించ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on January 19, 2023 1:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago