తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 40 ఎకరాల భూమిని అప్పనంగా 4 వేల కోట్లకుకొట్టేశారని.. రఘునందనరావు సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని కూడా ఆరోపించారు.
అయితే.. రఘునందనరావు చేసిన ఈ వ్యాఖ్యలపై తోట రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాదులో తనకు ఒక్క ఎకరా ఇచ్చినట్లు వారు నిరూపిస్తే 10 శాతం తను తీసుకుని మిగిలిన 90 శాతం ఆరోపణలు చేసిన వారికే ఇచ్చేస్తానని అన్నారు. కేవలం బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించిన ఇమేజ్ను దెబ్బతీసేందుకు మాత్రమే రఘునందనరావు ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
సంచలనాల కోసం బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. తెలంగాణలో ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో వాటిని ఏపీ ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఏపీలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతోందని తోట అన్నారు. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నేటి సభకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నామని, సభను విజయవంతం చేస్తున్నామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాగా, ఏపీ నుంచి 2 వేల బస్సులను తోట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి గాను ఆయన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
This post was last modified on January 18, 2023 3:24 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…