Political News

తోట వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌.. కొత్త స‌వాల్‌!

తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేత‌, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. 40 ఎక‌రాల భూమిని అప్ప‌నంగా 4 వేల కోట్ల‌కుకొట్టేశార‌ని.. ర‌ఘునంద‌న‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ స‌భ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నార‌ని కూడా ఆరోపించారు.

అయితే.. ర‌ఘునంద‌న‌రావు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై తోట రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతలు తనపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాదులో తనకు ఒక్క ఎకరా ఇచ్చినట్లు వారు నిరూపిస్తే 10 శాతం త‌ను తీసుకుని మిగిలిన 90 శాతం ఆరోప‌ణ‌లు చేసిన వారికే ఇచ్చేస్తాన‌ని అన్నారు. కేవ‌లం బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకు మాత్ర‌మే ర‌ఘునంద‌న‌రావు ఇలా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు.

సంచలనాల కోసం బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. తెలంగాణలో ఏ రకమైన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో వాటిని ఏపీ ప్రజలకు అందేలా కృషి చేస్తామ‌ని తెలిపారు.

ఏపీలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతోందని తోట అన్నారు. త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నేటి సభకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నామని, సభను విజయవంతం చేస్తున్నామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాగా, ఏపీ నుంచి 2 వేల బ‌స్సుల‌ను తోట ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి గాను ఆయ‌న దాదాపు కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

This post was last modified on January 18, 2023 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

2 hours ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

3 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

4 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

6 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

6 hours ago